Students attacked in Gujarat : గుజరాత్లో.. నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దాడి!
Mob assaults foreign students in Gujarat : హాస్టల్లో నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొందరు దుండగులు దాడి చేసిన ఘటన గుజరాత్లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.
Muslim students beaten in Gujarat : గుజరాత్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హాస్టల్లో నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితులు.. అఫ్గానిస్థాన్తో పాటు ఇతర ఆఫ్రికెన్ దేశాల నుంచి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. కాగా.. రంజాన్ మాసం కావడంతో నమాజ్ చేయాలని భావించారు. కానీ.. యూనివర్సిటీలో మసీదు లేకపోవడంతో.. హాస్టల్లోకి వెళ్లారు. రమాదాన్లో రాత్రి పూట చేసే తరావీహ్ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో.. కత్తులు, కర్రలు పట్టుకున్న కొందరు దండుగులు.. హాస్టల్లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు.. వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి.. దుండగులు హాస్టల్లో విధ్వంసం సృష్టించి, గదులను ధ్వంసం చేశారు.
Mob attacks muslim students in Gujarat : "గదిలోకి వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టారు. గట్టిగా అరిచారు. హాస్టల్లో నమాజ్ చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అని అడిగారు. మా ల్యాప్టాప్స్, ఫోన్స్ని ధ్వంసం చేశారు. బైక్స్ని కూడా ధ్వంసం చేశారు," అని అఫ్గానిస్థాన్కి చెందిన విద్యార్థి చెప్పాడు.
గాయపడిన ఐదుగురు విద్యార్థులు.. అఫ్గానిస్థాన్, శ్రీలంక, తుర్కమెనిస్థాన్, రెండు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు.
"ఘటన జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికి అందరు పారిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఎంబసీలకు కూడా సమాచారం ఇచ్చాము," అని సదరు విద్యార్థి చెప్పాడు.
గుజరాత్లో నమాజ్ చేసుకుంటున్న వారిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొందరు.. హాస్టల్పై రాళ్లు రువ్వడం, సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. 'మాకు భయంగా ఉంది', 'ఇది చాలా తప్పు,' అని విదేశీ విద్యార్థులు చెబుతుండటం.. కొన్ని వీడియోల్లో వినిపించాయి.
Gujarat crime news : "ఇక్కడ వాళ్లు నమాజ్ ఎందుకు చేస్తున్నారు? నమాజ్ చేయడానికి ఇదే దొరికిందా? అసలు ఇదే నమాజ్ చేసే చోటా?" అని దుండగుల్లో ఒకరు.. సెక్యూరిటీ గార్డ్ని ప్రశ్నించాడు. ఆ తర్వాత.. లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టించారు.
ఈ ఘటనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు.
"సిగ్గు చేటు. ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటూ, మతాన్ని అనుసరిస్తున్నప్పుడే.. మీకు మతంపై భక్తి పెరుగుతుంది. ముస్లింలను చూడగానే మీకు కోపం పెరిగిపోతుంది. అసలేంటిది? హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఇలా జరుగుతోంది. వాళ్లు జోక్యం చేసుకుంటారు?," అని ట్వీట్ చేశారు ఓవైసీ. తన ట్వీట్కి విదేశాంగ మంత్రి జైశంకర్ని ట్యాగ్ చేస్తూ.. ముస్లిం వ్యతిరేక భావాలు.. ఇండియాను నాశనం చేస్తున్నాయని రాసుకొచ్చారు.
తాజా ఘటనపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియోలను ఇక్కడ చూడండి :
(More to come)
సంబంధిత కథనం