Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..-virat kohli becomes first player to score 3000 runs at a venue in ipl rcb vs csk ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Published May 18, 2024 11:32 PM IST Chatakonda Krishna Prakash
Published May 18, 2024 11:32 PM IST

  • RCB vs CSK IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మరో మైలురాయి దాటాడు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నేటి (మే 18) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 47 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

(1 / 5)

ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నేటి (మే 18) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 47 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

(ANI)

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మార్క్ దాటాడు. దీంతో ఐపీఎల్‍లో ఒకే వేదికలో 3000 పరుగుల మైలురాయి సాధించిన తొలి ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. 

(2 / 5)

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మార్క్ దాటాడు. దీంతో ఐపీఎల్‍లో ఒకే వేదికలో 3000 పరుగుల మైలురాయి సాధించిన తొలి ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. 

(PTI)

విరాట్ కోహ్లీ మొత్తంగా ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 251 మ్యాచ్‍ల్లో 7,971 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు జాబితాలోనూ టాప్‍లోనేే ఉన్నాడు. 

(3 / 5)

విరాట్ కోహ్లీ మొత్తంగా ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 251 మ్యాచ్‍ల్లో 7,971 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు జాబితాలోనూ టాప్‍లోనేే ఉన్నాడు. 

(AP)

ఐపీఎల్‍లో 700 ఫోర్ల మార్క్ దాటిన రెండో ప్లేయర్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (768) తొలి ప్లేస్‍లో ఉన్నాడు. ఐపీఎల్‍లో అత్యధిక ఫోర్లు జాబితాలో శిఖర్, కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (599), సురేశ్ రైనా (506) ఉన్నారు. 

(4 / 5)

ఐపీఎల్‍లో 700 ఫోర్ల మార్క్ దాటిన రెండో ప్లేయర్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (768) తొలి ప్లేస్‍లో ఉన్నాడు. ఐపీఎల్‍లో అత్యధిక ఫోర్లు జాబితాలో శిఖర్, కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (599), సురేశ్ రైనా (506) ఉన్నారు. 

(AP)

ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ దశ చివరి మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ చేరింది బెంగళూరు. 

(5 / 5)

ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ దశ చివరి మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ చేరింది బెంగళూరు. 

(PTI)

ఇతర గ్యాలరీలు