తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Reliance Agm Live : ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్​

Reliance AGM live : ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్​

Sharath Chitturi HT Telugu

29 August 2022, 15:40 IST

    • Reliance AGM live : రిలయన్స్​ ఏజీఎం నుంచి మరో కీలక అప్డేట్​ వచ్చింది. ఈ ఏడాదిలో ఎఫ్​ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు రిలయన్స్​ రీటైల్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ ఇషా అంబానీ ప్రకటించారు.
ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్​
ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్​

ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్​

Reliance AGM live : ఎఫ్​ఎంసీజీ(ఫాస్ట్​ మూవింగ్​ కన్జ్యూమర్​ గూడ్స్​​) వ్యాపారంలోకి ఈ ఏడాదిలో అడుగుపెడుతున్నట్టు రిలయన్స్​ ప్రకటించింది. ఈ మేరకు.. రిలయన్స్​ ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో పాల్గొన్న ఆ సంస్థ రీటైల్​ విభాగం ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ ఇషా అంబానీ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

"ఎఫ్​ఎంసీజీ వ్యాపారాన్ని ఈ ఏడాది లాంచ్​ చేస్తున్నాము అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అత్యంత నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారు చేసి, డెలివరీ చేసి ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చడమే మా ముఖ్య ఉద్దేశం," అని ఇషా అంబానీ పేర్కొన్నారు.

Reliance FMCG : ఈ ఏడాదిలో రిలయన్స్​ రీటైల్​.. 2500కుపైగా స్టోర్స్​ను తెరిచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 15వేలకుపైగా రిలయన్స్​ రీటైల్​ స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్​ రీటైల్​ విభాగం ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే 1,50,000మందికి ఉద్యోగాలి ఇచ్చినట్టు ఇషా అంబానీ స్పష్టం చేశారు. మొత్త మీద తమ వద్ద 3.6లక్షలకుపైగా మంది ఉద్యోగులు ఉన్నట్టు పేర్కొన్నారు.

"ఈ ఏడాదిలో ఇప్పటివరకు మా బ్రాండ్స్​ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాము. ఎన్నో కొత్త ప్రాడక్టులను ప్రవేశపెట్టాము. వాట్సాప్​-జియో మార్ట్​ సేవలను కూడా లాంచ్​ చేశాము," అని ఇషా అంబానీ అన్నారు.

Reliance retail : "రానున్న 10ఏళ్ల కాలానికి బ్లూప్రింట్​ను తయారు చేస్తోంది రిలయన్స్​. అది పూర్తి అయిన తర్వాత.. మీతో పంచుకుంటాను. రిలయన్స్​ను మరింత ప్రభావవంతంగా, మరింత భారీగా తీర్చిదిద్దేందుకు అందరం కృషిచేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తల్లికి కృతజ్ఞతలు," అంటూ రిలయన్స్​ ఏజీఎంలో తన ప్రసంగాన్ని ముగించారు ఇషా అంబానీ.

రిలయన్స్​ ఏజీఎం వరుసగా మూడోసారి.. వర్చువల్​గా జరిగింది. దేశంలోని అతిపెద్ద సంస్థల్లో రిలయన్స్​ ఒకటి కావడంతో.. సంస్థ ఏజీఎంపై అటు పెట్టుబడిదారుల్లో, ఇటు ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి.

వాట్సాప్​లో షాపింగ్​..

వాట్సాప్​లో తొలిసారిగా షాపింగ్​ అనుభూతిని తీసుకొస్తున్నట్టు.. మెటా(ఫేస్​బుక్​)- జియో సోమవారం ప్రకటించాయి. వాట్సాప్​ ఛాట్​ నుంచి జియోమార్ట్​లో షాపింగ్​ చేసే వ్యవస్థను తీసుకొస్తున్నట్టు పేర్కొన్నాయి.

Jio Meta shopping : "ఇది ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతోంది. వాట్సాప్​లోని జియోమార్ట్​ సేవలతో.. గ్రాసరీలు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో ఎప్పుడూ షాపింగ్​ చేయని వారికి కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేక యాప్​ల ద్వారా ఇప్పుడు గ్రాసరీలు కొనుగోలు చేస్తున్నారు. కానీ మా వ్యవస్థతో.. వాట్సాప్​లోనే షాపింగ్​ చేసుకోవచ్చు," అని రిలయన్స్​ రీటైల్​ సోమవారం ఓ అధికారిక ప్రకటనను వెలువరించింది.

మెటా- జియో మధ్య కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ ఫీచర్​ని తీసుకొస్తున్నట్టు రిలయన్స్​ పేర్కొంది.