Jio to launch 5G services by Diwali : దీపావళి నాటికి జియో '5జీ’.. ముకేశ్​ అంబానీ ప్రకటన-reliance agm 2022 mukesh ambani speaks about jio 5g and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reliance Agm 2022, Mukesh Ambani Speaks About Jio 5g And More

Jio to launch 5G services by Diwali : దీపావళి నాటికి జియో '5జీ’.. ముకేశ్​ అంబానీ ప్రకటన

Sharath Chitturi HT Telugu
Aug 29, 2022 03:55 PM IST

Reliance AGM 2022 : రిలయన్స్​ ఏజీఎం.. సోమవారం జరిగింది. ఈ నేపథ్యంలో.. జియో 5జీని దీపావళి నాటికి తీసుకురానున్నట్టు ముకేశ్​ అంబానీ ప్రకటించారు.

ముకేశ్​ అంబానీ
ముకేశ్​ అంబానీ (MINT_PRINT)

Jio to launch 5G services by Diwali : జియో వినియోగదరులకు అదిరిపోయే వార్త! ఈ ఏడాది దీపావళి నాటికి.. అంటే మరో రెండు నెలల్లో జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. సోమవారం జరిగిన రిలయన్స్​ ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో.. ఆ సంస్థ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

"డిజిటల్​ కనెక్టివిటీలో కొత్త శకం మొదలుకానుంది. అదే జియో '5జీ'. 5జీతో.. 100 మిలియన్​ ఇళ్లు కనెక్ట్​ అవుతాయి. మెరుగైన డిజిటల్​ ఎక్స్​పీరియన్స్​ లభిస్తుంది. జీయో 5జీతో అందరిని, అన్ని ప్రాంతాలను, ప్రతి విషయాన్ని కలుపుకుంటూ వెళతాము. అత్యంత నాణ్యమైన సేవలు లభిస్తాయి. భారత దేశ అవసరాలతో పాటు.. అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక 5జీ నెట్​వర్క్​గా మన జీయో 5జీ నిలుస్తుంది. 5జీ లెటెస్ట్​ వర్షెన్​.. 'స్టాండ్​అలోన్​-5జీ'నీ తీసుకొస్తున్నాము. 4జీ నెట్​వర్క్​తో దీనికి అసలు సంబంధమే ఉండదు," అని రిలయన్స్​ ఏజీఎంలో.. ముకేశ్​ అంబానీ వ్యాఖ్యానించారు.

Reliance Industries Limited : దేశవ్యాప్తంగా జియో 5జీ సేవల కోసం రూ. 2లక్షల కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు తెలిపారు ముకేశ్​ అంబానీ. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్​కతా నగరాల్లో జియో 5జీ సేవలు తొలుత అందుబాటులోకి రానున్నాయని, 2023 చివరి నాటికి.. దేశంలోని ప్రతి పట్టణానికి ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.

స్టాక్​ మార్కెట్​లో రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ ప్రస్తుతం.. 18 పాయింట్ల నష్టంతో 2,600 వద్ద ఉంది.

రిలయన్స్​ ఏజీఎంలో ముకేశ్​ అంబానీ స్పీచ్​ హైలైట్స్​..

  • గ్రే హైడ్రోజన్​ నుంచి గ్రీన్​ హైడ్రోజన్​కు 2025 నాటికి రిలయన్స్​ మారుతుంది.
  • Mukesh Ambani Reliance AGM speech : బయో ఎనర్జీపై యాక్టివ్​గా పరిశోధనలు చేస్తున్నాము. జామ్​నగర్​లో బయో ఎనర్జీ టెక్నాలజీ సెంటర్​ ఫేస్​ 1ను ప్రారంభించాము.
  • 2035 నాటికి నెట్​ కార్బన్​ జీరో ఎమిషన్​ లక్ష్యాన్ని సాధించేందుకు రిలయన్స్​ కృషిచేస్తోంది.
  • ధీరుభాయ్​ అంబానీ గ్రీన్​ ఎనర్జీ గిగా కాంప్లెక్స్​లో.. నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు పని జరుగుతోంది. సోలార్​ ప్యానెళ్లు, ఎనర్జీ స్టోరేజ్​ సిస్టమ్స్​, ఫ్యూయెల్​ సెల్స్​ వంటి వాటిని తయారీ చేస్తాము.
  • గ్రీన్​ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్​ కట్టుబడి ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం