తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : గర్భవతిని మంచానికి కట్టేసి.. నిప్పంటించి చంపేసిన భర్త!

Crime news : గర్భవతిని మంచానికి కట్టేసి.. నిప్పంటించి చంపేసిన భర్త!

Sharath Chitturi HT Telugu

21 April 2024, 11:45 IST

    • Man kills wife in Punjab : గోడవతో కోపడిన ఓ భర్త.. తన గర్భవతి అయిన భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించి చంపేశాడు! పంజాబ్​లో జరిగింది ఈ దారుణ ఘటన..
భార్యను మంచానికి కట్టి, నిప్పంటించి చంపేసిన భర్త!
భార్యను మంచానికి కట్టి, నిప్పంటించి చంపేసిన భర్త!

భార్యను మంచానికి కట్టి, నిప్పంటించి చంపేసిన భర్త!

Man kills pregnant wife : పంజాబ్​లో అత్యంత అమానవీయ, షాకింగ్​, దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భవతి అయిన భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ వార్త సర్వత్రా కలకలం రేపుతోంది.

ఇదీ జరిగింది..

పంజాబ్​ అమృత్​సర్​కి సమీపంలోని బులలెనంగల్​ అనే గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. సుఖ్​దేవ్​- పంకీలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం 23ఏళ్ల పింకి ఆరు నెలల గర్భవతి. ఆమెకు కవలలు పుడతారని వైద్య రిపోర్టుల్లో తేలింది.

కాగా.. భార్యా-భర్తల మధ్య రిలేషన్​ ఎప్పుడు సరిగ్గా లేదు. మాటిమాటికి గొడవపడుతూనే ఉండేవారు. శుక్రవారం కూడా ఇదే జరిగింది! గొడవకు కారణం తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన సుఖ్​దేవ్​.. పంకీని మంచానికి కట్టేశాడు. ఆ తర్వాత అతి కిరాతకమైన పని చేశాడు. గర్భవతి అని కూడా చూడకుండా.. ఆమెను మంచానికి కట్టేసిన సుఖ్​దేవ్​.. చివరికి పంకీ శరీరానికి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయింది. సుఖ్​దేవ్​ అక్కడి నుంచి పారిపోయాడు.

Man kills wife in Punjab : ఈ ఘటనను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. అక్కడి పరిస్థితిని చూసి షాక్​ అయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా.. శనివారం సాయంత్రం నాటికి.. పోలసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

ఇదీ చూడండి:- Teacher sex with student : స్టూడెంట్​తో సెక్స్​ చేస్తూ దొరికిపోయిన లేడీ టీచర్​..

ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్​ స్పందించింది. ఘటనపై పూర్తి నివేదిక సమర్పిచాలని పంజాబ్​ పోలీసులకు ఆదేశాలిచ్చింది.

Man sets pregnant wife on fire : "అమృత్​సర్​లో జరిగిన ఘటన విని షాక్​కు గురయ్యాము. ఓ వ్యక్తి, తన గర్భవతి భార్యను మంచానికి కట్టేసి నిప్పంటించి చంపేశాడు. ఇలాంటిది ఊహకు కూడా అందని విషయం. పంజాబ్​ డీజీపీకి ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ శర్మరేఖ లెటర్​ రాశారు.ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పారు," అని ఎన్​సీడబ్ల్యూ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టింది.

కాగా.. నిందితుడు ఒక కూలీ అని సమాచారం. అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికంగా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

వ్యక్తి సజీవదహనం..

Punjab crime news latest : పంజాబ్​లో జరిగిన మరో ఘటన ఇది. ఓ 31ఏళ్ల వ్యక్తి.. సజీవదహనం అయ్యాడు. లుథియానా జిల్లాలోని బీజాలో ఒక పెట్రోల్​ బంక్​లో తన ట్రక్​ని పార్క్​ చేశాడు ఆ వ్యక్తి. కానీ శనివారం తెల్లవారుజామున ప్రాంతంలో.. ఈ బండికి నిప్పంటుకుంది. అతను సజీవదహనమైపోయాడు. ట్రక్​కు ఎలా మంటలు అంటుకున్నాయి? అనేది తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తదుపరి వ్యాసం