తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Electoral Bonds : జూన్​ 30 వరకు గడువు అడిగితే.. 24 గంటలే సమయం- ఎస్​బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది?

Electoral bonds : జూన్​ 30 వరకు గడువు అడిగితే.. 24 గంటలే సమయం- ఎస్​బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది?

Sharath Chitturi HT Telugu

11 March 2024, 12:49 IST

    • SBI Electoral bonds :  ఎస్​బీఐకి షాక్​ ఇస్తూ.. ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను మార్చ్​ 12 సాయంత్రం నాటికి సమర్పించాలని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. దాదాపు 3 నెలల సమయం అడిగిన ఎస్​బీఐ ముందు ఇప్పుడు కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మరి ఇప్పుడు ఎస్​బీఐ ఏం చేస్తుంది?
ఎస్​బీఐకి షాక్​.. రేపు సాయంత్రం వరకే సమయం!
ఎస్​బీఐకి షాక్​.. రేపు సాయంత్రం వరకే సమయం!

ఎస్​బీఐకి షాక్​.. రేపు సాయంత్రం వరకే సమయం!

Supreme court on Electoral bonds : ఎలక్టోరల్​ బాండ్స్​ విషయంలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు భారీ షాక్​ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. మార్చ్​ 12 సాయంత్రం నాటికి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందే అని తేల్చిచెప్పింది. మిగిలిన 24 గంటల్లో ఎస్​బీఐ ఏం చేస్తుంది? అని ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

24 గంటల్లో ఎస్​బీఐ ఏం చేస్తుంది?

ఏ వ్యక్తి లేదా ఏ సంస్థ.. ఎంత విలువ చేసే ఎలక్టోరల్​ బాండ్స్​ని కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీకి ఎంత ఇచ్చారు? ఏ రాజకీయ పార్టీ ఎంత నిధులను ఎన్​క్యాష్​ చేసుకుంది? వంటి వివరాలను మ్యాచ్​ చేసేందుకు సమయం పడుతుందని, అందుకే గడువును పొడిగించాలని అడినట్టు పిటిషన్​లో చెప్పింది ఎస్​బీఐ.

అయితే.. వివరాలను మ్యాచ్​ చేయాల్సిన అవసరం లేదని, ఎవరు విరాళం ఇచ్చారు? ఏ పార్టీ ఎంత ఎన్​క్యాష్​ చేసింది? అని వేరువేరుగా ఇస్తే చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్​ చేయాలని తాము తీర్పులో చెప్పలేదని పేర్కొంది. అందుకే.. మార్చ్​ 12 సాయంత్రం నాటికి.. డోనర్లు, విరాళల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని తేల్చిచెప్పింది.

SBI electoral bonds issue : అయితే.. మిగిలిన 24 గంటల సమయంలో ఎస్​బీఐ ఏం చేస్తుంది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో.. వివరాలు మ్యాచ్​ అవ్వకపోతే.. ఎవరు, ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారు? అన్న విషయంపై క్లారిటీ ఉండదు! డోనర్స్​ పేర్లు, పార్టీలకు అందిన విరాళాల పేర్లు మాత్రమే.. ఈసీకి ఎస్​బీఐ సమర్పించే అవకాశం ఉంది. ఆ వివరాలను మార్చ్​ 15 సాయంత్రం నాటికి.. ఈసీ తన వెబ్​సైట్​లో పబ్లీష్​ చేయాల్సి ఉంది.

ఒకవేళ వివరాలను ఎస్​బీఐ సమర్పించకపోతే.. అది కోర్టు దిక్కరణ కిందకు వస్తుంది. కోర్టు దిక్కరణను ఈసారి సహించబోమని తాజా ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో రాజకీయ ప్రకంపనలు..!

ఏది ఏమైనా.. ఎలక్టోరల్​ బాండ్స్​ డోనర్లు, రాజకీయ పార్టీలు రిడీమ్​ చేసుకున్న డబ్బుల వివరాల వ్యవహారం.. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా.. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం హాట్​ టాపిక్​గా మారడం గమనార్హం.

Supreme court latest news : సుప్రీంకోర్టు తాజా తీర్పును విపక్షాలు స్వాగతించాయి. వివరాలను మ్యాచ్​ చేయాల్సిన అవసరం లేదని, డోనర్లు పేర్లు- పార్టీలు ఎంత రిడీమ్​ చేసుకున్నాయి? వంటి వివరాలు చెబితే చాలని, ప్రజలకు నిజాలు అర్థమైపోతాయని బీజేపీని ఉద్దేశించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాయి. 

మరికొందరు మాత్రం.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజా హక్కులు మరింత బలోపేతమైనట్టు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల విషయంలో పార్టీలకు ఎవరు ఫండింగ్​ చేస్తున్నారు? ఎక్కడి నుంచి పార్టీలకు నిధులు వస్తున్నాయి? అన్న వివరాలు ప్రజలు తెలుసుకోవడం చాలా అవసరం అని, ఎలక్టోరల్​ బాండ్స్​తో అవి తెలిసేవి కావని అంటున్నారు.

తదుపరి వ్యాసం