తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Electoral Bonds : "రేపటి కల్లా ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను సమర్పించండి?"- ఎస్​బీఐకి సుప్రీం ఆదేశం

SBI electoral bonds : "రేపటి కల్లా ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను సమర్పించండి?"- ఎస్​బీఐకి సుప్రీం ఆదేశం

Sharath Chitturi HT Telugu

11 March 2024, 12:00 IST

    • Supreme court hearing on electoral bonds : ఎలక్టోరల్​ బాండ్స్​ విషయంలో ఎస్​బీఐ వేసిన పిటిషన్​ని సుప్రీంకోర్టు విచారించింది. ఈసీకి వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన ఎస్​బీఐపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టులో ఎలక్టోరల్​ బాండ్స్​పై విచారణ..
సుప్రీంకోర్టులో ఎలక్టోరల్​ బాండ్స్​పై విచారణ..

సుప్రీంకోర్టులో ఎలక్టోరల్​ బాండ్స్​పై విచారణ..

SBI electoral bonds hearing : ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఈ మేరకు.. వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ని పక్కనపెట్టేసింది. మంగళవారం సాయంత్రం నాటికి.. ఎట్టిపరిస్థితుల్లోనైనా వివరాలను సమర్పించాలని, ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్​ 15 నాటికి తమ వెబ్​సైట్​లో పబ్లీష్​ చేయాలని తేల్చిచెప్పింది.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ఎస్​బీఐకి భారీ షాక్​ తగిలినట్టు అయ్యింది.

'మా ఆదేశాలను ఎందుకు పాటించలేదు?'

రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చుతూ.. స్కీమ్​ని ఇటీవలే రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఏప్రిల్​ 12, 2019 నుంచి అమ్ముడుపోయిన బండ్స్​కి సంబంధించిన వివరాలను.. మార్చ్​ 6 నాటికి ఈసీకి ఇవ్వాలని ఎస్​బీఐకి ఆదేశాలిచ్చింది. ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్​ 13 నాటికి తమ అధికారిక వెబ్​సైట్​లో పబ్లీష్​ చేయాలని స్పష్టం చేసింది.కానీ చివరి నిమిషంలో.. మార్చ్​ 4న.. వివరాలు ఇచ్చేందుకు గడువును పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది ఎస్​బీఐ.

"ఇలాంటి విషయంలో మీరు గడువు పొడిగించాలని అడగటం చాలా సీరియస్​ విషయం. మా తీర్పు, ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి," అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Supreme court on electoral bonds : ఎస్​బీఐ తరఫు వాదనలు వినిపించిన సీనియర్​ న్యాయవాది హరీశ్​ సాల్వే.. అన్ని వివరాలను సేకరించేందుకు మరింత సమయం పడుతుందని, అందుకే గడువును పొడిగించాలని కోరినట్టు తెలిపారు.

ఆ మాటలు విన్న సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​.. "వివరాలను సీల్డ్​ కవర్​లో పెట్టి ముంబై బ్రాంచ్​కి సమర్పించినట్టు మీరే చెప్పారు. వివరాలను మ్యాచ్​ చేసి సమర్పించాలని మేము చెప్పలేదు. డోనర్స్​కి చెందిన వివరాలను ఇవ్వాలని ఎస్​బీఐకి స్పష్టంగా చెప్పాము. మా తీర్పును మీరు ఎందుకు పాటించలేదు?" అని అడిగారు.

"సీల్డ్​ కవర్​​లో అన్ని వివరాలు ఉంటే.. సింపుల్​గా ఆ కవర్​ని ఓపెన్​ చేసి, వివరాలు ఇవ్వొచ్చు కదా?" అని ప్రశ్నించారు జస్టిస్​ ఖన్నా.

అసలేంటి వివాదం..?

మరోవైపు.. జూన్​ 30 వరకు సమయం కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి వ్యతిరేకంగా మరో పిటిషన్​ దాఖలైంది. లోక్​సభ ఎన్నికలు ముగిసేంత వరకు డోనర్స్​ పేరును బయట పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఎస్​బీఐ.. ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను దాచిపెడుతోందని వ్యాజ్యంలో పేర్కొంది అసొసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ అండ్​ కామన్​ కాస్​.

ఏ వ్యక్తి అయినా లేదా ఏ సంస్థ అయినా.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలని అనుకుంటే.. ఎేస్​బీఐ దగ్గరికి వెళ్లి ఈ ఎలక్టోరల్​ బాండ్స్​ని కొనాల్సి వచ్చేది. ఇందులో డోనర్​ పేరును సీక్రెట్​గా ఉంటుంది. ఎవరు ఇచ్చారు? అన్న విషయం ఎవరికీ తెలియదని కేంద్రం చెబుతూ వచ్చింది. కానీ.. డోనర్స్​ వివరాలను పూర్తిగా ట్రేస్​ చేయవచ్చని.. ఎలక్టోరల్​ బాండ్స్​ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ సుదీర్ఘ కాలం పాటు విచారించిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్​ బాండ్స్​ని రద్దు చేసింది.

తదుపరి వ్యాసం