తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Liquor Case Explained : హై- ప్రొఫైల్​ నేతలపై పిడుగు- 'లిక్కర్​' కేసుతో ఉక్కిరిబిక్కిరి!

Liquor case explained : హై- ప్రొఫైల్​ నేతలపై పిడుగు- 'లిక్కర్​' కేసుతో ఉక్కిరిబిక్కిరి!

Sharath Chitturi HT Telugu

22 March 2024, 6:56 IST

  • Liquor case explained in Telugu : అసలేంటి ఈ దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు? ఇప్పటివరకు ఎంత మంది అరెస్ట్​ అయ్యారు? ఈడీ ఏం చెబుతోంది? ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీ లిక్కర్​ కేసులో కొనసాగుతున్న బడా నేతల అరెస్ట్​లు..
దిల్లీ లిక్కర్​ కేసులో కొనసాగుతున్న బడా నేతల అరెస్ట్​లు..

దిల్లీ లిక్కర్​ కేసులో కొనసాగుతున్న బడా నేతల అరెస్ట్​లు..

Arvind Kejriwal arrested : 'లిక్కర్​ కేస్​.. లిక్కర్​ కేస్​.. లిక్కర్​ కేస్​..' దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​తో.. దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అంతేకాదు.. వారం రోజుల వ్యవధిలో బీఆర్​ఎస్​ నేత కవిత- కేజ్రీవాల్​ని ఈడీ అరెస్ట్​ చేయడం.. ఈ కేసు తీవ్రతకు అద్దపడుతోంది. ఈ పరిణామాలు.. సరిగ్గా 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు జరుగుతుండటం.. సర్వత్రా చర్చలకు దారితీసింది. ఫలితంగా.. దిల్లీ లిక్కర్​ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్​ పడింది. అసలేంటి ఈ లిక్కర్​ కేసు? బడా నేతలపై ఈడీ మోపిన ఆరోపణలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

దిల్లీ లిక్కర్​ కేసు వివరాలు..

2021-22 ఏడాదిలో.. దిల్లీ ఎక్సైజ్​ లిక్కర్​ పాలసీని ప్రవేశపెట్టింది అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం. దక్షిణ భారతానికి చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఆమ్​ ఆద్మీ కుమ్మక్కైందని, రూ. 100 కోట్ల లంచం తీసుకుని, వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించిందన్నది ప్రధాన ఆరోపణ. కాగా.. కొంతకాలం తర్వాత.. ఈ దిల్లీ లిక్కర్​ పాలసీని ప్రభుత్వం కొట్టివేసింది. కానీ ఈడీ మాత్రం.. లిక్కర్​ పాలసీలో స్కామ్​ జరిగిందని చెబుతూ వస్తోంది.

ఈడీ ప్రకారం.. అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, బీఆర్​ఎస్​ నేత కే. కవితలు.. శరత్​ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు. 2021-22 లిక్కర్​ పాలసీ 'డీల్​'లో భాగంగా.. శరత్​, మాగుంట, కవితలకు.. దిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లు దక్కాయి. పాలసీలో హోల్​సేలర్స్​కి 12శాతం, రీటైర్లకు 185శాతం ప్రాఫిట్​ మార్జిన్​ వస్తుంది. ఇది సాధారణం కన్నా చాలా చాలా ఎక్కువ!

What is Delhi liquor scam : ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్​ అయ్యారు. వారు.. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, బీఆర్​ఎస్​ నేత కవిత, ఆమ్​ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్​.

ఈ 12శాతం ప్రాఫిట్​లో 6శాతం ప్రాఫిట్స్​ని హోల్​సేలర్స్​ నుంచి ఆమ్​ ఆద్మీ పార్టీ వసూలు చేయాలని డీల్​ కుదిరిందని ఈడీ ఆరోపిస్తోంది.

"దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో కలిసి కవిత.. లిక్కర్​ స్కామ్​కు పాల్పడ్డారు. నాటి దిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్​శాఖ మంత్రి సిసోడియా హస్తం కూడా ఉంది. మధ్యవర్తుల ద్వారా.. కవిత, సౌత్​ గ్రూప్​ కలిసి.. ఆమ్​ ఆద్మీకి ముడుపులు చెల్లించింది. ఫలితంగా.. కవితకు పాలసీ ఫార్ములేషన్​పై పట్టు దక్కింది. కవిత కోరుకున్నట్టుగా ఆమెకు ఈ పాలసీలో ప్రయోజనం చేకూరింది," అని.. గత వారం బీఆర్​ఎస్​ నేతను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించిన అనంతరం ఓ ప్రకటనలో పేర్కొంది ఈడీ.

వీళ్లే కుట్ర చేశారు..?

Delhi liquor case explained in Telugu : ఈడీ ప్రకారం.. ఆమ్​ ఆద్మీ నేతల తరఫున ఈ లిక్కర్​ పాలసీ 'వ్యవహారాలను' ఆ పార్టీకి చెందిన మాజీ కమ్యూనికేషన్స్​ ఇన్​ఛార్జ్​ విజయ్​ నాయర్​ చూసుకున్నారు. రూ. 100 కోట్ల ముడుపులు.. ఆయన ద్వారనే చేతులు మారాయి!

"విజయ్​ నాయర్​.. ఓ సాధారణ ఆమ్​ ఆద్మీ పార్టీ కార్యకర్త కాదు. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి అత్యంత సన్నిహితుడు," అని గతేడాది ఈడీ విడుదల చేసిన డాక్యుమెంట్​లో ఉంది.

అయితే.. కుట్రకు పాల్పడింది కవితే అయినా.. ఈ లిక్కర్​ పాలసీ అనేది కేజ్రీవాల్​ సృష్టి అని ఈడీ చెబుతోంది. ఈ విషయాన్ని, ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త సమీర్​ మహేంద్రు చెప్పినట్టు ఈడీ పేర్కొంది.

"కేజ్రీవాల్​, మహేంద్రుల మధ్య ఫేస్​టైమ్ కాల్​​ నిర్వహించాడు నాయర్​. విజయ్​ తన మనిషి అని, అతడిపై నమ్మకం ఉంచాలని కేజ్రీవాల్​.. మహేంద్రుకు చెప్పారు," అని ఈడీ ఆరోపిస్తోంది.

లిక్కర్​ స్కామ్​ కేసు విచారణలో భాగంగా.. మనీశ్​ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్​.. పలు కీలక విషయాలను వెల్లడించారు.

Kejriwal arrested : "2021 మార్చ్​లో నేను కేజ్రీవాల్​ ఇంటికి వెళ్లాను. ప్రైవేట్​ సంస్థలకు 12శాతం మార్జిన్​ ఇవ్వాలని అప్పుడే నిర్ణయంచారు. దానికన్నా ముందు జరిగిన జీఓఎం (గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​) సమావేశంలో.. 12శాతం ప్రాఫిట్​ వ్యవహారం చర్చకు రాలేదు. కానీ 2021 మార్చ్​లో.. కేజ్రీవాల్​ నివాసంలో కీలక నేతలు కలిశారు. జీఓఎం రిపోర్ట్​ డ్రాఫ్ట్​ని నా చేతుల్లో పెట్టారు. హోల్​సేల్​ బిజినెస్​.. ప్రైవేట్​ సంస్థలకు వెళ్లాలని, అందకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్​ని తయారు చేయాలని చెప్పారు. అప్పటివరకు చర్చే జరగని ప్రతిపాదనను తొలిసారిగా అప్పుడే చూశాను," అని సీ అరవింద్​.. ఈడీ విచారణలో చెప్పారు.

అయితే.. 2023 డిసెంబర్​లో ఈడీ వేసిన 6వ ఛార్జ్​ షీట్​ ప్రకారం.. లిక్కర్​ పాలసీ కింద వచ్చిన రూ. 45 కోట్ల ముడుపులను ఆమ్​ ఆద్మీ పార్టీ.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఇది నేరపూరితమైన చర్య. అంతేకాకుండా.. ఇలా వచ్చిన డబ్బులతో.. పలువురు ఆమ్​ ఆద్మీ నేతలు కూడా లబ్ధిపొందరు. సిసోడియాకు రూ. 2.2 కోట్ల లంచం దక్కింది. సంజయ్​ సింగ్​, నాయర్​లకు ఆ ఫిగర్​ రూ. 2 కోట్లు, రూ. 1.5కోట్లుగా ఉంది.

అయితే.. ఈ నేరపూరిత చర్యలకు సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి ఇంకా ఈడీ ఎలాంటి లింక్​ని పెట్టలేదు.

Kejriwal news today ED : మరి ఈ దిల్లీ లిక్కర్​ కేసు ఇంకెన్ని మలుపులు తిరిగుతుందో! ఇంకెంతమంది పేర్లు బయటకి వస్తాయో! జైలుకు వెళ్లిన వారు ఎప్పుడు బయటకి వస్తారో! వంటి విషయాలకు కాలమే సమాధానం చెబుతుంది.

తదుపరి వ్యాసం