తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu New Movie Ssmb28 Release Date Locked

SSMB28: అప్డేట్ అదిరిందిగా.. మహేశ్-త్రివిక్రమ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

18 August 2022, 17:43 IST

    • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రానున్న SSMB28 సినిమా విడుదల తేదీని లాక్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
మహేశ్-త్రివిక్రమ్
మహేశ్-త్రివిక్రమ్ (Twitter)

మహేశ్-త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా చిత్రబృందం మహేశ్ అభిమానులు గుడ్ న్యూస్ చెప్పేసింది. ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసింది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళిలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

Sabari Review: శబరి రివ్యూ - వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Brahmamudi May 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకున్న కావ్య- అమ్మోరుగా కనకం- స్వప్న రివేంజ్ ప్లాన్

ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇవేమి విడుదల చేయకుండానే రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. మహేశ్ బాబు కూడా ఇటీవల షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. వీలైనంత వేగవంతంగా సినిమాను తీసి అనుకున్న సమయానికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరికి కాస్త గ్యాప్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మహేశ్‌తో హై యాక్షన్ థ్రిల్లర్ తీసేందుకు చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు.

మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది. మహేశ్‌తో ఇప్పటికే మహర్షి సినిమాలో చేసిన ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రిన్స్ సరసన నటించనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.