తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

07 May 2024, 22:00 IST

    • Janhvi Kapoor - Shikhar Pahariaya: శిఖర్ పహారియాను జాన్వీ కపూర్ వివాహం చేసుకోనున్నారంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. తిరుపతిలో వీరి పెళ్లి జరగనుందని ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ ఫొటో పోస్ట్ అయింది. దీనికి జాన్వీ కపూర్ స్పందించారు.
Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్
Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Janhvi Kapoor: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజిబీజీగా ఉంటున్నారు. దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‍లోనూ అడుగుపెడుతున్నారు. కాగా, శిఖర్ పహారియాతో ఆమె ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు కనిపించారు. తిరుమలకు కూడా ఓసారి కలిసే వచ్చారు. కాగా, తిరుపతిలో శిఖర్ పహారియనాను జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్‌తో ఓ ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ తాజాగా జాన్వీ కంట పడింది. దీనికి ఆమె స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

జాన్వీ కామెంట్ ఇదే

జాన్వీ కపూర్ - శిఖర్ పహారియా వివాహం తిరుపతిలో జరగనుందంటూ ఓ ఫొటోను ఓ యూజర్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. దీనికి జాన్వీ రియాక్ట్ అయ్యారు. ‘కుచ్ బీ’ అంటూ ఆ పోస్ట్‌కు జాన్వీ కామెంట్ చేసేశారు. ఏదైనా రాసేస్తారా అనే అర్థంతో ఆమె ఆ కామెంట్ పెట్టారు. తన పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని జాన్వీ స్పష్టం చేశారు.

‘కాఫీ విత్ కరణ్‍’లో ఇలా..

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా డేటింగ్‍లో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ సైలెంట్‍గానే ఉంటూ వస్తున్నారు. అయితే, గతేడాది కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయంపై జాన్వీ హింట్ ఇచ్చారు. తన స్పీడ్ డయల్‍లో ఎవరి నంబర్లు ఉన్నాయని జాన్వీని కరణ్ జోహార్ అడిగారు. దీంతో పప్పా, కుషు, శిఖ్ అని జాన్వీ చెప్పారు. ఆ తర్వాత శిఖర్ పేరు ఎందుకు చెప్పానా అన్నట్టు ఊ అని అన్నారు. దీంతో జాన్వీ - శిఖర్ రిలేషన్‍పై రూమర్లు మరింత బలపడ్డాయి.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడే శిఖర్ పహారియా. జాన్వీ - శిఖర్ కొన్నాళ్ల డేటింగ్ తర్వాత విడిపోయారని రూమర్లు వచ్చాయి. అయితే, మళ్లీ కొన్నాళ్లకే వారు కలిసిపోయారు. ఇద్దరూ కలిసి చాలాసార్లు బయట కనిపించారు.

ముంబైలో మైదాన్ సినిమా ప్రీమియర్‌కు జాన్వీ కపూర్ హాజరయ్యారు. వైట్ డ్రెస్ ధరించి వచ్చారు. అయితే, ఆమె ధరించిన చైన్‍కు శిఖు అని రాసి ఉండడం అందరినీ ఆకర్షించింది. తన బాయ్ ఫ్రెండ్ ముద్దుపేరును లాకెట్‍గా జాన్వీ ధరించారు. ఇలా.. తమ రిలేషన్ గురించి మరోసారి హింట్ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో శిఖర్ పహారియాతో కలిసి తిరుమల ఆలయాన్ని జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.

టాలీవుడ్‍లో ఎంట్రీ

అలనాటి దిగ్గజ హీరోయిన్ శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్.. తెలుగులోనూ అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మయి తంగం పాత్రను ఆమె పోషిస్తున్నారు. లాంగావోణీలో జాన్వీ లుక్ అదిరిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్‍తోనూ జాన్వీ కలిసి నటించనున్నారు. చరణ్ - బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న మూవీ(RC16)లో జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు. బాలీవుడ్‍లో ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉల్జాతో పాటు మరో మూవీ కూడా జాన్వీ లైనప్‍లో ఉంది. ఇలా.. వరుస చిత్రాలతో జాన్వీ బీజీగా ఉంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం