తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Pbks: శుభ్‌మన్ క్లాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు

GT vs PBKS: శుభ్‌మన్ క్లాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu

04 April 2024, 21:22 IST

    • GT vs PBKS: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ కు సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టైటన్స్ టీమ్ కు తిరిగొచ్చాడు.
శుభ్‌మన్ క్లాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు
శుభ్‌మన్ క్లాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు (AFP)

శుభ్‌మన్ క్లాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు

GT vs PBKS: ఐపీఎల్ 2024లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్. కెప్టెన్ ఇన్నింగ్స్ తో 89 పరుగులు చేయడంతో గుజరాత్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు భారీ స్కోరు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 200 పరుగులు చేయాలి. గిల్ మెరుపులు, తెవాతియా ఫినిషింగ్ టచ్ హోమ్ టీమ్ కు మంచి స్కోరు అందించాయి.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

చెలరేగిన గిల్

శుభ్‌మన్ గిల్ ఓపెనర్ గా వచ్చి చివరి బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. చివరికి గిల్ 48 బంతుల్లో 89 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అయితే ఈ ఇన్నింగ్స్ లో గిల్ ఆడిన ప్రతి షాట్ కళ్లు చెదిరేలా ఉంది. ఓవైపు ఒక్కో బ్యాటర్ క్రీజులోకి వచ్చి వెళ్తుంటే.. గిల్ మాత్రం ఇన్నింగ్స్ మొత్తం భారాన్ని తన భుజాలపై వేసుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

చివర్లో తెవాతియా కేవలం 8 బంతుల్లో 23 రన్స్ చేయడంతో గుజరాత్ టైటన్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 రన్స్ చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్, కగిసో రబాడా తమ 4 ఓవర్ల కోటాలో చెరో 44 రన్స్ ఇవ్వడం విశేషం. అటు హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 33 పరుగులు ఇచ్చారు.

పంజాబ్ కింగ్స్‌ ముందు భారీ లక్ష్యం

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటన్స్ తరఫున వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమ్ కు ఈ ఇద్దరూ మెరుపు ఆరంభమే ఇచ్చినా.. స్కోరు 29 పరుగుల దగ్గర సాహా (11) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. గతేడాది ఐపీఎల్లో మొదట్లోనే గాయపడి లీగ్ మొత్తానికి దూరమైన కేన్.. మళ్లీ ఇన్నాళ్లకు ఐపీఎల్లో అడుగుపెట్టాడు.

అయితే అతడు మంచి టచ్ లో కనిపించాడు. నెమ్మదిగా మొదలు పెట్టి జోరు పెంచాడు. ఓవైపు శుభ్‌మన్ గిల్ దంచి కొడుతుంటే.. విలియమ్సన్ అతనికి చక్కని సహకారం అందించాడు. 22 బంతుల్లోనే 4 ఫోర్లతో 26 రన్స్ చేసి అతడు ఔటయ్యాడు. కేన్ ఔటైన తర్వాత సాయిసుదర్శన్ క్రీజులోకి వచ్చాడు. తనదైన స్టైల్లో వచ్చీ రాగానే అతడు బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

వరుస బౌండరీలతో చెలరేగాడు. సుదర్శన్ 19 బంతుల్లో 33 రన్స్ చేశాడు. గిల్ తో కలిసి మూడో వికెట్ కు 53 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే చివర్లో వచ్చిన రాహుల్ తెవాతియా మ్యాచ్ ను తనదైన స్టైల్లో ముగించాడు. అతడు కేవలం 8 బంతుల్లోనే 23 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం