తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Today : లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. నిఫ్టీ 140 పాయింట్లు జంప్​

Stock market today : లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. నిఫ్టీ 140 పాయింట్లు జంప్​

Sharath Chitturi HT Telugu

06 October 2022, 9:18 IST

    • Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్​ అవుతున్నాయి.
ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 497పాయింట్ల లాభంతో 58562 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 143పాయింట్లు వృద్ధి చెంది 17417 వద్ద ట్రేడ్​ అవుతోంది.

దసరా సందర్భంగా బుధవారం స్టాక్​ మార్కెట్లకు సెలవు. కాగా.. మంగళవారం దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. 1277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​.. 58,065 వద్ద స్థిరపడింది. 387 పాయింట్లు వృద్ధిచెంది.. 17274 వద్ద ముగిసింది నిఫ్టీ. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 58314-17379 వద్ద ప్రారంభించాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,165- 17056 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 17335-17396 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : హీరో మోటోకార్ప్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 2530, టార్గెట్​- రూ. 2750- రూ. 2800
  • జేఎస్​డబ్ల్యూ స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 630, టార్గెట్​- రూ. 660

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

ఇన్ఫీ, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, ఎన్​టీపీసీ, టెక్​ఎం, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్​ అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి. అమెరికా జాబ్స్​ డేటా మరింత బలంగా ఉంది. ఫలితంగా ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాలు పెరిగాయి. డౌ జోన్స్​ 0.14శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.2శాతం, నాస్​డాక్​ 0.25శాతం మేర నష్టపోయాయి.

ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.7శాతం లాభాల్లో ఉంది. హాంగ్​సెంగ్​ సూచీ 0.48శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.17శాతం పడింది. సౌత్​ కొరియా కాస్పి 0.8శాతం వృద్ధిచెందింది.

చమురు ధరలు..

Crude oil price latest : ముడి చమరు ఉత్పత్తిని రోజుకు 2మిలియన్​ బ్యారెళ్లకుపైగా తగ్గించాలని ఒపెక్​ ప్లస్​ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా బ్రెంట్​ క్రూడ్​ 46సెంట్లు పెరిగి.. బ్యారెల్​కు 93.83డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,344.63కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 945.92కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

తదుపరి వ్యాసం