తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silve Rate On Today 20 October 2022

Today Gold and Silver Rate : పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే

Anand Sai HT Telugu

20 October 2022, 6:53 IST

    • Gold and Silver Rate Today : దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోల్చకుంటే.. ఇవాళ ధరలు పెరిగాయి.
బంగారం ధరలు
బంగారం ధరలు (REUTERS)

బంగారం ధరలు

Gold and Silver Rate Today : దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 10 గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 130 పెరిగి.. రూ. 46,550కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 46,420గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1300 పెరిగి.. రూ. 4,65,500కి చేరింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 140 పెరిగి.. రూ. 50,780కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,640గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1400 పెరిగి.. రూ. 5,07,800గా ఉంది.

Today Gold Rate : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లులో మార్పులు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,780గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇంచుమించుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,270గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,580గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,700గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,780గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,780గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,780గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today : దేశంలో వెండి ధరల్లో తాజాగా స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ.5,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 తగ్గి.. 56,400కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 56,600గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 61,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,400.. బెంగళూరులో రూ.61,500గా కొనసాగుతోంది.