తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  South Central Railway Announced Sabarimala Special Trains

Sabarimala Special Trains: శబరిమల వెళ్లేవారికి శుభవార్త.. స్పెషల్ ట్రైన్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

10 November 2022, 7:31 IST

    • south central railway special trains: శబరిమల వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
శబరిమల ప్రత్యేక రైళ్లు,
శబరిమల ప్రత్యేక రైళ్లు,

శబరిమల ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... శబరిమలకు వెళ్లే ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నర్సాపూర్, కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలు చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

narsapur kottayam special trains: నర్సాపూర్-కొట్టాయం మధ్య( Train No.07119) ఈ నెల 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైళ్లు. ఈ రైళ్లు 05:00 గంటలకు బయలుదేరి.. మరుసటి 03:50 గంటలకు గమ్యానికి చేరుతుంది.

ఇక కొట్టాయం-నర్సాపూర్ మధ్య( Train No.07120) నవంబర్ 19, 26 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను ప్రకటించారు. ఈ రైళ్లు ఆయా రోజుల్లో 10.50 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు 16.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, సేలం, ఆలువ, ఎర్నాకులం స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

మరిన్ని ప్రత్యేక రైళ్లు…..

tirupati secunderabad special trains: తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 10వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 09.10 గంటలకు రైలు బయల్దేరి... మరునాడు ఉదయం 09.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయిచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - puri special trains: సికింద్రాబాద్ - పూరీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ నెల 11, 18, 25వ తేదీల్లో ఈ సేవలను నడపనున్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్ రాత్రి 08.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మరునాడు సాయంత్రం 05.30 నిమిషాలకు పూరీకి చేరుతుంది. ఇక పూరీ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.45 నిమిషాలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరా, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెరంపుర్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

subedarganj special trains: సుబేదార్ గంజ్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 27 తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. నవంబర్ 8 - 26వ తేదీ వరకు మధ్యాహ్నం 03. 50 నిమిషాలకు సుబేదార్ గంజ్ నుంచి బయల్దేరి... ఆయా తేదీల్లో మరునాడు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ - సుబేదార్ గంజ్ మధ్య నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాత్రి 09.50 నిమిషాలకు బయల్దేరి... ఆయా తేదీల్లో మరునాడు ఉదయం 4 గంటలకు సుబేదార్ గంజ్ కు చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ఫతేపూర్, కాన్పూర్, ఒరై, బీనా, భోపాల్, నాగ్ పూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట్ జంక్షన్లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.