తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ratha Saptami In Tirumala: ఒకే రోజు ఏడు సేవలు.. తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు

Ratha Saptami in Tirumala: ఒకే రోజు ఏడు సేవలు.. తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు

HT Telugu Desk HT Telugu

28 January 2023, 9:02 IST

    • తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు (twitter)

తిరుమలలో రథసప్తమి వేడుకలు

Ratha Saptami Celebrations in Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువీధులన్నీ శ్రీవారి నామస్మరణంతో మార్మోగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Ooty, Kodaikanal: వేసవి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి..

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. భక్తులకు ఎలాంటి భక్తులు రాకుండా చర్యలు తీసుకుంది. ఇవాళ వేకువజాము నుండి రాత్రి వరకు స్వామి వారు వివిధ వాహనాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకి రానున్న క్రమంలో… పటిష్టమైన చర్యలు తీసుకుంది.

- రథసప్తమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు.

- ఇవాళ తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

- రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.

- తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.

- వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు.

- ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.

- దర్శన స్లాట్‌లను పాటించని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతి ఇస్తారు.