Telangana Temples Tour : తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను రెండ్రోజుల్లో దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. కాకతీయుల కాలం నాటి ఆలయాలైన కాళేశ్వరం, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట, కీసరగుట్ట అతి తక్కువ ధరలో దర్శించుకోచ్చు. తెలంగాణ టెంపుల్ టూర్(కాకతీయ రీజియన్)పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ కోడ్ ద్వారా ప్రతి శనివారం, ఆదివారం టూర్ ప్యాకేజీ అందిస్తున్నారు.
నాన్-ఏసీ హైటెక్ కోచ్ లో ప్రయాణం, కాళేశ్వరం హరిత హోటల్లో ఫ్రెష్ అప్ ఉంటుంది. దర్శనం టికెట్లు, ఆహారం ఈ ప్యాకేజీలో మినహాయింపు ఉంటుంది.
తెలంగాణ టెంపుల్ టూర్(కాకతీయ రీజియన్) పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ టూరిజం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్ అందిస్తోంది. ఏసీ మినీ కోచ్ బస్సులో ఈ హెరిటేజ్ టూర్ ఉంటుంది.
పర్యటన వివరాలు : హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్
టూర్ ఆహారం, దర్శనం, బోటింగ్ టిక్కెట్లను మినహాయింపు ఉంటుంది.
సంబంధిత కథనం