ఇప్పుడు ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి, గంభీర్ వివాదం(Virat Kohli Vs Gambhir) గురించే. సోషల్ మీడియాలో కోహ్లి వర్సెస్ గంభీర్ పేరుతో లెక్కలేనన్ని పోస్టులు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం లక్నో సూపర్జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG Vs RCB) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం మెుదలైంది. ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. తమ ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన విరాట్ కోహ్లి, గంభీర్(Virat Kohli-Gambhir) మధ్య గొడవ హాట్ టాపిక్ అయింది. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ దిగ్గజ క్రికెటర్లు మైదానంలో గొడవ పడటం సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
వీరిద్దరిపై సోషల్ మీడియాలో లెక్కలేనని పోస్టులు ఉన్నాయి. తెలుగులో మాత్రం ఓ మీమ్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన బలగం సినిమా(Balagam Movie)ని కోహ్లీ, గంభీర్ కు చూపించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. బలగం సినిమా చూసి.. చాలా కుటుంబాలు కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా చూసి.. కోహ్లీ, గంభీర్ కలిసిపోతారని తెలుగులో మీమ్స్(Telugu Memes) క్రియేట్ చేశారు. సుడిగాడు సినిమాలో పృథ్వీరాజ్ కు అల్లరి నరేశ్ సీరియళ్లు వేసి చూపిస్తాడు కదా. సేమ్ ఆ సీన్ ను మీమ్ గా క్రియేట్ చేసి వదిలారు. ఇక అది కాస్త వైరల్ అవుతుంది.
కోహ్లి-గంభీర్లకు బలగం(Kohli-Gambhir Balagam Movie) సినిమాను అర్జంట్గా చూపించాలని అభిమానులు కోరుతున్నారు. కుటుంబంలోని ఆప్యాయతలు, అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని చూపించి వారిద్దరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని అంటున్నారు. ఈ మేరకు నెట్టింట మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
బలగం సినిమా చూశాక.. 'వద్దు బ్రో.. మేం కలిసిపోతాం ' అనే మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బలగం సినిమాలోని 'ఒక్కతల్లి బిడ్డలురో నా కొడుకా.. కలిసిమెలిసి ఉండాలిరా నా కొడుకా..' పాటతో ఈ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్ వేణు(Comedian Venu) దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసి చాలా మంది మారిపోయారు. సినిమా చూసిన తర్వాత అన్నదమ్ములు కలిసిన ఘటనలూ ఉన్నాయి. సేమ్ టూ సేమ్ బలగం సినిమా చూపిస్తే కోహ్లీ, గంభీర్ కూడా మారతారని ట్రోల్ చేస్తున్నారు.
సంబంధిత కథనం