కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. శబరిమల అయ్యప్ప దేవాలయం అనగానే 18 మెట్లు గుర్తుకు వస్తాయి.
అయ్యప్ప మాల ధరించి ఇరుముడి కట్టుకున్న వారికి మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కేందుకు సాధారణ భక్తులకు అనుమతి ఉండదు. ఈ పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. పంచ లోహాలతో ఈ మెట్లకు పూత పూశారు. రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, 4 వేదాలు మొత్తం కలిపి 18 మెట్లుగా మారినట్టు చెప్తారు.
తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలతో సమానం. ఎనిమిది మెట్లు అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మొహం, మాస్తర్యం, దంబం సూచిస్తాయి. మరో మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలను సూచిస్తాయి. చివరి రెండు మెట్లు విద్య, అవిద్యగా చెప్తారు. అలాగే ఈ పద్దెనిమిది మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అష్టాదశ దేవతలు వీటిని సంరక్షిస్తూ ఉంటారని చెబుతారు. అలాగే అయ్యప్ప స్వామి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన 18 అస్త్రాలను విడిచి పెట్టాడని అంటారు.
అలాగే శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 18 కొండలు దాటాలి. ఆ కొండల పేర్లు ఏంటంటే
ఇవన్నీ దాటుకుంటూ పట్టబంధాసనంలో కూర్చుని అభయ హస్తంతో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుని అయ్యప్ప దీక్షలు విరమిస్తారు.