Tripti Dimri: యానిమల్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను.. మనసు అల్లకల్లోలమైంది.. తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్-tripti dimri says she cries continuously two three days after animal release for bold scenes criticism in podcast ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tripti Dimri: యానిమల్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను.. మనసు అల్లకల్లోలమైంది.. తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్

Tripti Dimri: యానిమల్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను.. మనసు అల్లకల్లోలమైంది.. తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Tripti Dimri Says She Cried After Animal Release: యానిమల్ మూవీ రిలీజ్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను అని తాజాగా తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సక్సెస్ తర్వాత ఫాలోవర్స్ పెరిగారని చెప్పిన తృప్తి దిమ్రి ఊహించని విషయాలు చెప్పింది.

యానిమల్ తర్వాత రెండు మూడు రోజులు ఏడ్చాను.. మనసు అల్లకల్లోలమైంది.. తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్

Tripti Dimri About Animal Release: సినీ ఇండస్ట్రీలో యానిమల్ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాతో బోల్డ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా నిరూపించుకున్నారు. అలాగే, యానిమల్‌తో అందులో హీరోగా నటించిన రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నాతోపాటు ఇతర నటీనటులకు సూపర్ క్రేజ్ వచ్చింది.

దారుణమైన పరిస్థితి

వీరందరికి కంటే యానిమల్‌తో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి. యానిమల్ ఒక్క సినిమాతో తృప్తి దిమ్రి కెరీరే మారిపోయింది. చిన్న సినిమాల్లో నటిస్తూ నెట్టుకొచ్చిన తృప్తి ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా ఫేమస్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అయితే, యానిమల్‌తో మంచి లైమ్ లైట్‌లోకి వచ్చినప్పటికీ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తృప్తి చెప్పింది.

నిరంతరాయంగా ఏడ్చాను

యానిమల్ సినిమా విడుదలైన తర్వాత తన మనసు చాలా దారుణంగా బాధపడిందని, రెండు మూడు రోజుల పాటు నిరంతరాయంగా ఏడ్చానని తన ఆవేదన చెప్పుకొచ్చింది తృప్తి దిమ్రి. ఇటీవల రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్ చేసింది.

నెగెటివ్ కామెంట్స్

"యానిమల్ విజయం తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నాకు పని దొరికింది. కానీ, ఆ తర్వాత నా దృష్టి నెగెటివ్ కామెంట్స్ వైపు మళ్లింది. ప్రజల చేసిన నెగెటివ్ కామెంట్స్ చదివిన తర్వాత చాలా ఏడ్చేశాను. నేను 2-3 రోజులు ఏడ్చానని అనుకుంటున్నాను. అది అలవాటు కాదు కదా. నేను ఇలా విమర్శలను భరించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అని తృప్తి దిమ్రి తెలిపింది.

చెడు మాటలు వినాల్సి వస్తోంది

ఆ సమయంలో చాలా విషయాలు జరిగాయని తృప్తి దిమ్రి పేర్కొంది. "సగం మంది నన్ను ప్రశంసిస్తున్నారు. సగం మంది విమర్శిస్తున్నారు. ఇతర సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. అయినా కూడా ప్రజల చెడు మాటలు వినాల్సి వస్తోంది. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నా మనసు అల్లకల్లోలమైంది" అని తృప్తి దిమ్రి వెల్లడించింది.

నెమ్మదిగా కోలుకుంటున్నా

"జనం ఎలా తీసుకుంటున్నారో అనిపించింది. అంటే నన్ను ఎలా అర్థం చేసుంటున్నారో అని మానసికంగా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను నా సోదరితో మాట్లాడాను. ఆ విషయంపై నాకు ఆమె వివరించారు. ఈ గాయం నుంచి బయటపడటానికి నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. తరువాత నెమ్మదిగా కోలుకుంటున్నాను" అని తన పడిన ఆవేదన గురించి యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి తెలిపింది.

2017లో ఎంట్రీ

ఇదిలా ఉంటే, 2017లో 'మామ్' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్నూ, బుల్ బుల్, క్వాలా చిత్రాలు చేసింది తృప్తి. అనంతరం 2023లో 'యానిమల్' సినిమాతో సక్సెస్ అందుకుంది. రాత్రికి రాత్రే తృప్తి ఫేమస్ అయింది. దాంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య 6.05 లక్షల నుంచి 2 మిలియన్లకు పెరిగారు. నేషనల్ క్రష్ అని కూడా పిలిచే రేంజ్‌కు ఎదిగింది తృప్తి దిమ్రి.