Ysrcp Campaign : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47,000 బూత్లలో వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్ల(Ysrcp Star Campaigners)తో చేపట్టిన "జగన్ కోసం సిద్ధం"(Jagan Kosam Siddham) కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ తన 2.5 లక్షల బూత్ స్థాయి కార్యకర్తల ద్వారా స్టార్ క్యాంపెయినర్ల నమోదు కార్యక్రమం చేపడుతోంది. బూత్ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ప్రతి కుటుంబాన్ని సందర్శించి గత ఐదేళ్లలో సదరు కుటుంబానికి జరిగిన లబ్దిని వివరిస్తూ.. పేదల అభివృద్ధి కోసం సీఎం జగన్(CM Jagan) ని మళ్లీ గెలిపించుకుందాం అనే నినాదంతో జగన్ కోసం సిద్ధం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతి కుటుంబం నుంచి లబ్దిదారులే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలన్న సీఎం జగన్ పిలుపునకు తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది. 9 లక్షలకు పైగా లబ్దిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకుని సీఎం జగన్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వైసీపీ తెలిపింది.
సంబంధిత కథనం