AP CID Notices: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్టు బదలాయింపు వ్యవహారంలో దాని పూర్వపు యజమాని కేవీ రావు ఫిర్యాదుపై సాయిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది.