తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శనివారం రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాటి ఆసౌకర్యాం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.