TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... అశ్వవాహనంపై మలయప్పస్వామి దర్శనం - ఫొటోలు-sri malayappa donning kalki avataram and riding aswa vahanam to bless his devotees in tirumala brahmotsavalu 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ttd Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... అశ్వవాహనంపై మలయప్పస్వామి దర్శనం - ఫొటోలు

TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... అశ్వవాహనంపై మలయప్పస్వామి దర్శనం - ఫొటోలు

Published Oct 11, 2024 09:18 PM IST Maheshwaram Mahendra Chary
Published Oct 11, 2024 09:18 PM IST

  • Tirumala Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి  అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి  అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

(1 / 6)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి  అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో  స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

(2 / 6)

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో  స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.  

(3 / 6)

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.  

అశ్వవాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.

(4 / 6)

అశ్వవాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన శనివారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్కరిణిలో స్నప‌న తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

(5 / 6)

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన శనివారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్కరిణిలో స్నప‌న తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

 రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

(6 / 6)

 రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇతర గ్యాలరీలు