IRCTC Tirupati Tour : తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ఇదిగో టూర్ ప్యాకేజీ
IRCTC Tirupati Tour Package : శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటారు. వారికోసం ఐఆర్సీటీసీ(IRCTC) ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి టూర్ ప్రారంభమవుతోంది. అక్టోబర్ 21 ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఇది రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం(Kanipakam), శ్రీకాళహస్తి, తిరుచానూర్, తిరుపతి కవర్ అవుతాయి.
Day 1
విశాఖపట్నం విమానాశ్రయంలో 06:25 గంటలకు విమానం ఎక్కాలి. 08:25 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్(Air Port) నుండి పికప్ చేసుకుంటారు. హోటల్ లో చెక్-ఇన్ కావాలి. అల్పాహారం నుంచి భోజనం వరకు విశ్రాంతి తీసుకోవాలి. భోజనానంతరం ఆలయాల సందర్శన ఉంటుంది. కాణిపాకం, శీనివాసమంగాపురం వెళ్లాలి. సాయంత్రం తిరిగి హోటల్కి రావాలి. డిన్నర్ చేసి రాత్రి బస చేయాలి.
Day 2
రెండో రోజు ఉదయం హోటల్లో అల్పాహారం ముగించుకోవాలి. ఆ తర్వాత శ్రీ బాలాజీ దర్శనం(Balaji Darshan) కోసం వెళ్లాలి. లంచ్ ఉంటుంది. అనంతరం శ్రీకాళహస్తి , తిరుచానూరు సందర్శన చేయిస్తారు. సాయంత్రం తిరిగి హోటల్కి రావాలి. డిన్నర్ చేశాక రెండో రోజు కూడా హోటల్ లోనే బస ఉంటుంది.
Day 3
తెల్లవారుజామున 05:00 గంటలకు హోటల్(Hotel) నుండి చెక్ అవుట్ చేయాలి. 08:45 గంటలకు విశాఖపట్నం వెళ్లడానికి విమానం ఉంటుంది. 10:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ టూరిజం(IRCTC Tourism) తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14040గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14235, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.17605గా చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, తిరుపతిలో బస, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
సంబంధిత కథనం