IRCTC Tour Package: రాజమండ్రి టూ తిరుమల, తిరుచానూరు - ఈ టూర్ ప్యాకేజీ చూడండి
Rajahmundry Tirumala Tour Package: రాజమండ్రి నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
irctc tourism announced tirumala tour tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా రాజమండ్రి నుంచి తిరుమల, తిరుచానూరు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. VIJAY GOVINDAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు ప్రాంతాలకు వెళ్తారు.ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....
rajahmundry tirumala tour : అక్టోబర్ 7 వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
Day 1: సామల్ కోట జంక్షన్ వద్ద నుంటి సాయంత్రం 05.40 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. ఇక రాజమండ్రి నుంచి సాయంత్రం 06.20 నిమిషాలు, విజయవాడ వద్ద నుంచి రాత్రి 10.50, తెనాలి నుంచి రాత్రి 11. 20 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
Day 2: ఉదయం 05.10 నిమిషాలకు ట్రైన్ తిరుపతికి చేరుకుంటుంది. అక్కడ్నుంచి హోటల్ కి వెళ్తారు. మధ్యాహ్నం ఫ్రెష్ అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అనంతరం తిరుచానూరు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ కు వస్తారు. రాత్రి 10.30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
Day 3: తెనాలికి అర్ధరాత్రి 01.48 నిమిషాలకు, విజయవాడకు 02:40 గంటలకు, రాజమండ్రికి 05:53, సామల్ కోట జంక్షన్ కు ఉదయం 06:38 గంటలకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ఛార్జీలివే..
vijay govindam tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 7,990 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 6,940 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.6,800 గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.