తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Updates Of Telugu States Over Rain Alert By Imd

Rains Telugu States: మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

12 October 2022, 9:36 IST

    • rain alert to telugu states: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Rains in AP and Telangana: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండో రోజులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది,

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15వ తేదీ ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మంగళవారం ఆదిలాబాద్‌, కొమరం భీం, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

ఇక హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మోఘవృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు (గాలి వేగం గంటకు 04 - 08 కి.మీ) వీచే అవకాశం ఉంది అని ఓప్రకటనలో వివరించింది.

ఏపీలోనూ వర్షాలు…

rains in andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో కురిసింది. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో పలు కాలనీలు జలదిగ్భంధలోనే ఉన్నాయి. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.