తెలుగు న్యూస్  /  Telangana  /  Scr Announced Holi Special Trains Between Various Destinations Check Full Details

SCR Holi Special Trains: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి హోలీ ప్రత్యేక రైళ్లు - వివరాలివే

HT Telugu Desk HT Telugu

01 March 2023, 14:42 IST

    • South Central Railway Special Trains: హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తేదీలు, ట్రైమింగ్స్ వివరాలను పేర్కొంది.
హోలీ ప్రత్యేక రైళ్లు
హోలీ ప్రత్యేక రైళ్లు

హోలీ ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాది రాష్ట్రాలకు పలు రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలు చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

హోలీ పండగ దృష్ట్యా... హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ నుంచి బికనేర్, సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 4వ తేదీన సికింద్రాబాద్-రక్సౌల్ ( ట్రైన్ నెంబర్ 07051) ఎక్స్‌ప్రెస్ రైలు, రక్సౌల్-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్. 07052) రైలును మార్చి 9వ తేదీన నడపనుంది. ఇక మార్చి 4వ తేదీన కాచిగూడ-బికనేర్ (ట్రైన్ నెంబర్. 07053) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. మార్చి 7వ తేదీన బికనేర్-కాచిగూడ (ట్రైన్ నెంబర్ - 07054) రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ హోలీ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ప్రకటించారు.

సమ్మర్ ట్రైన్స్.. వివరాలు

వేసవి దృష్ట్యా పలు రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి - అకోలా, అకోలా - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది మార్చి 3 నుంచి మే 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అకోలా - తిరుపతి రూట్ లో నడిచే రైలును కూడా... మార్చి 19 నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. తిరుపతి - పూర్ణ, పూర్ణ - తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన స్పెషల్ ట్రైన్స్ ను కూడా మార్చి 3 నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.

హైదరాబాద్ - నర్సాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును... మార్చి 18వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు పొడిగించగా... నర్సాపూర్ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ ను మార్చి 19వ తేదీ నుంచి మే 28 తేదీ వరకు పొడిగించారు. హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను కూడా పొడిగించారు అధికారులు. మార్చి 30వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.విజయవాడ- నాగర్ సోల్, నాగర్ సోల్ - విజయవాడ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు.

కాకినాడ టౌన్- లింగపల్లి, లింగపల్లి - కాకినాడ టౌన్ మధ్య ఉన్న స్పెషల్ ట్రైన్స్ కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 13వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు. మచిలీపట్నం- సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మచిలీపట్నం రూట్ లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు. వీటిని మార్చి 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మచిలీపట్నం - తిరుపతి, తిరుపతి మచిలీపట్నం మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను పొడిగించారు. మార్చి 10వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు.