Rape Case In Zaheerabad : ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై గ్యాంగ్ రేప్
25 September 2022, 16:01 IST
- Telangana Crime News : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
జహీరాబాద్-డిడిగి శివారులో దారుణం జరిగింది. ఓ వివాహిత(24)పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. సికింద్రాబాద్ తిరుమలగిరి నుంచి ఆటోలో వివాహితని జహీరాబాద్-డిడిగి శివారులోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత.. గ్యాంగ్ రేప్ చేశారు.
శనివారం ఉదయం వివాహిత అచేతన స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత విషయాన్ని.. జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో చెప్పారు. వివాహితకి మత్తుమందు ఇచ్చి దుండగులు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనను గోప్యంగా ఉంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!
ప్రియురాలిపై దాడి
ముషీరాబాద్ బోలక్పూర్కు చెందిన రంజిత్, అదే ప్రాంతానికి చెందిన మరో యువతి కొన్ని రోజులుగా లవ్ చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపానికి వెళ్లారు. ఇద్దరు కాసేపు.. మాట్లాడుకున్నారు. అయితే ఆ తర్వాత.. మాటా మాటా పెరిగి.. గొడవ జరిగింది. రంజిత్ పదునైన ఆయుధంతో అమ్మాయిపై దాడి చేశాడు.
అయితే ఈ ఘటనలో యువతి చేతికి బలమైన గాయం అయింది. ఈ దాడి తర్వాత.. రంజిత్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఈ విషయాన్ని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు గమనించారు. వెంటనే పోలీసులకు విషయం చెప్పారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతిని ఆసుపత్రికి తరలించారు. రంజిత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.