తెలుగు న్యూస్  /  National International  /  Watch: Covid Test For Fish And Crabs In China Amid Rise In Cases

Covid test for fish : అక్కడ చేపలకు కూడా కొవిడ్​ టెస్టింగ్​.. ‘పిచ్చి పట్టిందా?’

Sharath Chitturi HT Telugu

19 August 2022, 16:51 IST

    • Covid test for fish : మనుషులు కొవిడ్​ టెస్ట్​ చేసుకోవడం సహజం. మరి చేపలు, పీతలకు కూడా కొవిడ్​ టెస్టులు నిర్వహిస్తే? చైనాలో ఇప్పుడు పరిస్థితి ఇదే!
అక్కడ చేపలకు కూడా 'కొవిడ్​ టెస్టింగ్'​.. ఎందుకంటే!
అక్కడ చేపలకు కూడా 'కొవిడ్​ టెస్టింగ్'​.. ఎందుకంటే! (South China morning post/twitter)

అక్కడ చేపలకు కూడా 'కొవిడ్​ టెస్టింగ్'​.. ఎందుకంటే!

Covid test for fish : కొవిడ్​ కట్టడి పేరుతో రకరకాల ఆంక్షలతో ప్రజలను భయపెట్టిన చైనా.. ఇప్పుడు ఒకడుగు ముందుకేసింది. కొవిడ్​ నేపథ్యంలో.. ఇప్పటివరకు మనుషులకు మాత్రమే కొవిడ్​ టెస్టులు నిర్వహించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు, పీతలను కూడా యాడ్​ చేసింది!

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

చేపలు, పీతలకు ఎందుకు?

చైనాలో ఈ ఏడాది తొలినాళ్ల నుంచి కొవిడ్​ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొవిడ్​ కేసులు పెరగడం.. కఠిన చర్యలతో వ్యాప్తిని తగ్గించడం సాధారణ విషయమైపోయింది. కాగా.. ఇటీవలి కాలంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షియామెన్​ ప్రాంతంలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్​ టెస్టులు చేస్తున్నారు.

China Covid cases : ఇందుకు సంబంధించిన వీడియోను సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​.. తన ట్విట్టర్​లో షేర్​ చేసింది. వీడియో ప్రకారం.. కొందరు హెల్త్​ వర్కర్​లు.. పీపీటీ కిట్లు ధరించి ఉన్నారు. చేపలను చేతిలో పట్టుకుని, వాటికి కొవిడ్​ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనంతరం పీతలను సైతం టెస్ట్​ చేస్తున్నారు.

ఈ వీడియో.. చైనావ్యాప్తంగా వైరల్​గా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియోకు ఇప్పటికే 2లక్షలకుపైగా వ్యూస్​ లభించాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వ్యవహారంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు.. 'ఏంటిది?' అని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు 'తప్పేముంది?' అని అంటున్నారు.

"జంతువుల నుంచే కదా కొవిడ్​ మనుషులకు సోకింది? మరి జంతువులను కూడా టెస్ట్​ చేయాలి," అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. 'మీరు పిచ్చొళ్లుగా మారిపోయారు,' అని ఇంకో నెటిజన్​ కామెంట్​ పెట్టాడు.

'ముందు వూహాన్​ మార్కెట్​లోని జంతువులను కొవిడ్​ టెస్ట్​ చేయాలి,' అని ఇంకో నెటిజన్​ ట్వీట్​ చేశారు.

కొవిడ్​ పుట్టుక ఎలా జరిగింది?

Covid origin : 2019 చివర్లో.. చైనాలో కొవిడ్​ ఉద్భవించింది. అనంతరం.. కొన్ని నెలల వ్యవధిలోనే అది ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది కొవిడ్​ బారిన పడ్డారు. కొవిడ్​ కట్టడి కోసం ప్రపంచ దేశాలు విధించిన లాక్​డౌన్​ అస్త్రం కారణంగా అనేకమంది జీవనోపాధి కోల్పోయారు.

కాగా.. చైనాలోని వూహాన్​కు చెందిన ఓ సీ ఫుడ్​ మార్కెట్​ నుంచి కొవిడ్​ వ్యాపించిందని అప్పట్లో వార్తలు జోరుగా సాగాయి. అదే కాకుండా.. వూహాన్​లోనే, మార్కెట్​కు పక్కన ఓ ల్యాబ్​ ఉంది. అందులో నుంచి వైరస్​ బయటకొచ్చిందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా కొవిడ్​ పుట్టుకపై ఎన్నో కథలు, నివేదికలు బయటకొచ్చాయి.

కానీ.. కొవిడ్​ పుట్టుకపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎలాంటి నిర్ధరణకు రాలేదు.