తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China| కొవిడ్​ నెగిటివ్​ వచ్చినా.. వేలాది మందికి 'క్వారంటైన్​' తిప్పలు!

China| కొవిడ్​ నెగిటివ్​ వచ్చినా.. వేలాది మందికి 'క్వారంటైన్​' తిప్పలు!

HT Telugu Desk HT Telugu

21 May 2022, 11:17 IST

    • చైనా రాజధాని బీజింగ్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టులు ఉన్న వేలాది మందిని కూడా క్వారంటైన్​కు తరలిస్తుండటం ఇప్పుడు వార్తలకెక్కింది.
బీజింగ్​లో కఠిన కొవిడ్​ నిబంధనలు
బీజింగ్​లో కఠిన కొవిడ్​ నిబంధనలు (AP)

బీజింగ్​లో కఠిన కొవిడ్​ నిబంధనలు

China covid news | చైనాలో ఉండే కఠిన ఆంక్షల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొవిడ్​ పేరుతో అక్కడి యంత్రాంగం అరాచకాలే సృష్టిస్తోంది. ఆ ఆంక్షలతో చైనావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న దృశ్యాలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇక ఇప్పుడు.. చైనా యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. బీజింగ్​లో కరోనా సంక్షోభం వేళ.. కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టులు ఉన్న వేలాది మంది కూడా క్వారంటైన్​లో పెట్టింది!

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

ఆ 26మంది వల్ల..

షాంఘై తర్వాత.. ప్రస్తుతం బీజింగ్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వం.. అక్కడ 'జీరో కొవిడ్​' విధానాన్ని అమలు చేసింది. కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే నాన్క్సిన్యువాన్ ప్రాంతంలో లాక్​డౌన్​ విధించింది. అంతటితో ఆగకుండా.. శుక్రవారం రాత్రి వేలాది మందిని అప్పటికప్పుడు క్వారంటైన్​ హొటళ్లకు తరలించింది. వారందరికీ కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టులు ఉన్నా.. క్వారంటైన్​లో పెట్టడం ఇప్పుడు వార్తలకెక్కింది. 

ఇందుకు కారణం ఓ 26మంది! గత కొన్ని రోజులుగా.. ఆ ప్రాంతంలోని 13వేల మందిలో 26మందికి వైరస్​ సోకింది. అంతే! కఠిన ఆంక్షలను అమలు చేస్తూ.. వేలాది మందిని క్వారంటైన్​ చేసేసింది అక్కడి యంత్రాంగం.

Beijing coronavirus restrictions | ఈ క్వారంటైన్​.. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు అమలులో ఉంటుంది. తమ నిబంధనలకు సహకరించాలని, లేకపోతే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాత్రికి రాత్రి.. బట్టలు సద్దుకుని, క్యూలో నిలబడి వాహనాలు ఎక్కుతున్న చైనావాసుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

"మాలో చాలా మంది.. ఏప్రిల్​ నుంచే లాక్​డౌన్​లో ఉన్నారు. మాకు కొవిడ్​ నెగిటివ్​ వచ్చింది. అయినా మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. ఇక్కడున్న వారిలో చాలా మంది వృద్ధులు, చిన్నారులే. మేము యుద్ధభూమిలో ఉన్నట్టు అనిపిస్తోంది," అని ఓ స్థానికుడు చైనా సామాజిక మాధ్యమం విబోలో పోస్ట్​ చేశాడు.

కాగా.. ప్రజల ఆందోళనలు తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. శుక్రవారం రాత్రి వరకు ఉన్న అనేక పోస్టులు.. శనివారం ఉదయం నాటికి మాయమైపోయాయి!

టాపిక్

తదుపరి వ్యాసం