తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shiv Sena News: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురు దెబ్బ; ఠాక్రే వర్గానికి షాకిచ్చిన ఈసీ

Shiv Sena news: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురు దెబ్బ; ఠాక్రే వర్గానికి షాకిచ్చిన ఈసీ

HT Telugu Desk HT Telugu

17 February 2023, 20:21 IST

  • Shiv Sena news: పార్టీలో తిరుగుబాటుతో మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన శివసేన (Shiv Sena) నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) కు శుక్రవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

ఉద్ధవ్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే (HT_PRINT)

ఉద్ధవ్ ఠాక్రే

Shiv Sena news: పార్టీలో చీలిక నేపథ్యంలో శివసేన (Shiv Sena) రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గంగా, తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గంగా శివసేన విడిపోయింది. ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంతో సీఎం అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Shinde faction gets Shiv sena name: పేరు, గుర్తు షిండేదే..

ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) పార్టీ పేరు, పార్టీ గుర్తు ఎవరికి చెందాలనే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నది. ఇటు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం, అటు ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గం సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. తాజాగా, ఎన్నికల సంఘం ఈ వివాదంపై కీలక ఆదేశాలను వెలువరించింది. శివసేన (Shiv Sena) పార్టీ పేరుతో పాటు, పార్టీ గుర్తు అయిన విల్లంబులు (bow and arrow) ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికే చెందుతాయని శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు.. శివసేన (Shiv Sena) నుంచి గెలిచిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు లభించిన మొత్తం ఓట్లలో 23.5% ఓట్లు మాత్రమే వచ్చాయని, మిగతా 76.5% ఓట్లు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు వచ్చాయని, అందువల్ల పార్టీ పేరు, పార్టీ గుర్తు అయిన విల్లంబులు షిండే (Eknath Shinde) వర్గానికే చెందుతాయని నిర్ణయించామని ఎన్నికల సంఘం వివరించింది. గత అక్టోబర్ లో తాత్కాలికంగా ఉద్ధవ్ వర్గానికి కాగడా గుర్తును, ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ అనే పేరును ఎన్నికల సంఘం కేటాయించింది.

Shinde reaction: షిండే హ్యాపీ..

ఎన్నికల సంఘం ఆదేశాలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) సంతోషం వ్యక్తం చేశారు. తమదే అసలైన శివసేన (Shiv Sena) అని ఎన్నికల సంఘం గుర్తించడం సంతోషకరమన్నారు. బాలాసాహెబ్ రాజకీయ వారసత్వానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయం ఊహించేదనని Shiv Sena ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై తమకు విశ్వాసం ఏనాడో పోయిందన్నారు.