Shiv Sena symbol fight : ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో?-ec takes note of shiv sena symbol fight seeks submissions by aug 8 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ec Takes Note Of Shiv Sena Symbol Fight Seeks Submissions By Aug 8

Shiv Sena symbol fight : ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో?

Sharath Chitturi HT Telugu
Jul 23, 2022 12:19 PM IST

Shiv Sena symbol fight : శివసేనకు చెందిన రెండు వర్గాలకు నోటీసులు ఇచ్చింది ఈసీ. పార్టీ చిహ్నంపై బలాన్ని నిరూపించుకోవాలని తేల్చిచెప్పింది.

ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో?
ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో? (Twitter/shivsena)

Shiv Sena symbol fight : రెండుగా చీలిపోయిన శివసేన పార్టీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది! ఇప్పుడు పార్టీ 'చిహ్నం'పై రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. పార్టీ గుర్తును నిలుపుకునేందుకు అటు ఉద్ధవ్​ ఠాక్రే, దానిని దక్కించుకునేందుకు ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరు వర్గాలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ చిహ్నం విషయంపై ముందు తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరువర్గాలకు స్పష్టం చేసింది. సంబంధిత పత్రాలను ఆగస్టు 8లోపు సమర్పించాలని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

1968 ఎన్నికల చిహ్నం(రిజర్వేషన్​ అండ్​ అలాట్​మెంట్​) ఆదేశాల్లోని 15వ పారాను ఉటంకిస్తూ.. శివసేనలోని రెండు వర్గాలకు ఈ నోటీసులిచ్చింది ఈసీ. శాసనసభ్యులు, పార్టీకి చెందిన వ్యవస్థాపక విభాగాల మద్దతుతో కూడిన పత్రాలను సమర్పించాలని వెల్లడించింది.

లోక్​సభ, మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమకు గుర్తింపు లభించిందని, అందువల్ల శివసేన పార్టీ చిహ్నం తన వర్గానికే కేటాయించాలని.. వారం రోజుల క్రితం ఎన్నికల సంఘాన్ని ఏక్​నాథ్​ షిండే అభ్యర్థించారు. ఈ క్రమంలోనే పార్టీ చిహ్నం వ్యవహారంపై నోటీసులు జారీ చేసింది ఈసీ.

మహారాష్ట్ర స్థానిక ఎన్నికలకు పోలింగ్​ నిర్వహించాలని, ఇందుకోసం రెండు వారాల్లోపు నోటిఫికేషన్​ను జారీ చేయాలని.. ఎన్నికల సంఘానికి బుధవారమే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో శివసేన పార్టీ చిహ్నం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అంతకుముందు.. ఎన్నికల సంఘానికి ఉద్ధవ్​ ఠాక్రే లేఖ రాశారు. పార్టీ పేరు, చిహ్నం విషయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు.. తమ వాదనను వినాలని అభ్యర్థించారు.

‘మహా’ సంక్షోభం..

Mahrashtra politics : 2019 ఎన్నికల అనంతరం బీజేపీతో సంబంధం తెంచుకుని బయటకు వచ్చేసింది శివసేన. సీఎం కూర్చీని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత.. ఎన్​సీపీ- కాంగ్రెస్​తో కలిసి మహా వికాస్​ అఘాడీని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్​ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు.

దాదాపు మూడేళ్ల పాలన సాగిపోయింది. కానీ గత నెలలో శివసేనలో పెద్ద కుదుపు! పార్టీపై తీవ్ర అసంతృప్తితో బయటకొచ్చేశారు సీనియర్​ నేత ఏక్​నాథ్​ షిండే. గుజరాత్​లోని సూరత్​కు మకాం మార్చేశారు. ఎవరి ఫోన్లూ ఎత్తలేదు. ఆయనతో పాటు 10-11మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. వారందరు.. అక్కడి నుంచి అసోంకు వెళ్లారు. వారికి రోజురోజుకు మద్దతు పెరిగింది. ఈ వ్యవహారం ముగిసే సమయానికి దాదాపు 40ఎమ్మెల్యేలు.. ఏక్​నాథ్​కు మద్దతుగా నిలిచారు.

Uddhav Thackerey : మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రేకు నిద్రలేని రోజులు తప్పలేదు. పార్టీపై పట్టుకోల్పోయారు. ఒకరకంగా చెప్పాలంటే.. పార్టీ రెండుగా చీల్చిపోయింది. ఆయన స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చివరికి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్​నాథ్​ షిండే. సీఎంగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ విధంగా.. శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం