తెలుగు న్యూస్  /  National International  /  How Indian States/uts Contributed To The New Parliament Building Construction Full Details Here

New Parliament building : నూతన పార్లమెంట్​ భవన నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర ఇది..

Sharath Chitturi HT Telugu

28 May 2023, 10:30 IST

  • New Parliament building inauguration : నూతన పార్లమెంట్​ భవన నిర్ణాణంలో వివిధ రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆ విశేషాలు చూద్దాము..

నూతన పార్లమెంట్​ భవనం లోపలి భాగం..
నూతన పార్లమెంట్​ భవనం లోపలి భాగం..

నూతన పార్లమెంట్​ భవనం లోపలి భాగం..

New Parliament building inauguration : దిల్లీలో నూతన పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్​ భవనం విశేషాలు వార్తల్లో నిలిచాయి. అయితే ఈ భవనం నిర్మాణంలో వివిధ రాష్ట్రాల పాత్ర కూడా ఉంది! అ వివరాలు చూద్దాము..

రాళ్ల నుంచి శిల్పాలు చెక్కడం వరకు..!

నూతన పార్లమెంట్​ భవనం నిర్ణాణంలో వినియోగించిన సాండ్​స్టోన్​ (ఇసుకరాయి)ని రాజస్థాన్​ సర్మాథుర నుంచి తీసుకొచ్చారు. దిల్లీలోని హుమాయున్​ టోంబ్​, ఎర్ర కోటను కూడా ఇదే సాండ్​స్టోన్​తో నిర్మించడం విశేషం.

లోక్​సభ ఛాంబర్​లోని కేషారియా గ్రీన్​ స్టోన్​ను ఉదయ్​పూర్​ నుంచి తీసుకొచ్చారు. రాజ్యసభ ఛాంబర్​లోని రెడ్​ గ్రనైట్​ను అజ్మీర్​లోని లఖా నుంచి తెల్ల పాలరాయి మెటీరియల్​ను అంబాజీ నుంచి తీసుకొచ్చారు.

నూతన పార్లమెంట్​ భవనంలో వినియోగిస్తున్న ఫర్నీచర్​ను ముంబైలో తయారు చేశారు. బిల్డింగ్​లో ఉపయోగించిన టేకు చెక్కను నాగ్​పూర్​ నుంచి తీసుకొచ్చారు.

భవనంలోని ఫాల్స్​ సీలింగ్​కు ఉపయోగించిన స్టీల్​ను దమన్​ అండ్​ దియూ నుంచి, అశోక చిహ్నాన్ని రూపొందించేందుకు కావాల్సిన మెటీరియల్​ను ఔరంగాబాద్​, జైపూర్​ నుంచి తీసుకొచ్చారు.

లోక్​సభ, రాజ్యసభలో ఏర్పాటు చేసిన ఆశోక చక్రాలను ఇండోర్​ నుంచి తీసుకొచ్చారు.

New Parliament building inauguration Live : నూతన పార్లమెంట్​ భవనంలో ఉన్న లాటిస్​ వర్క్​ (జాలులు)ను ఉత్తర్​ ప్రదేశ్​, నోయిడా, రాజస్థాన్​లో రూపొందించారు.

భవనం నిర్మాణం కోసం వాడిన కంకరరాళ్లను కోట్​పుట్లి నుంచి తీసుకొచ్చారు. శిల్పాలను చెక్కిన వారు ఉదయ్​పూర్​ నుంచి వచ్చారు.

ఫ్లై యాష్​ ఇటుకలను హరియాణా, ఉత్తర్​ ప్రదేశ్​ నుంచి బ్రాస్​ వర్క్​- ప్రీ కాస్ట్​ ట్రెంచెస్​ను అహ్మదాబాద్​ నుంచి తీసుకొచ్చారు. లోక్​సభ, రాజ్యసభలోని ఫాల్స్​ సీలింగ్​ స్ట్రక్చర్​ను దమన్​ దయూల తయారు చేశారు.

రాళ్లను చెక్కే పని ఉదయ్​పూర్​ అబు రోజ్​లో జరిగింది.

ప్రారంభోత్సవ వేడుకలు..

పార్లమెంట్​ భవనంలో ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజదండాన్ని లోక్​సభలోని స్పీకర్​ కుర్చీ వద్ద ప్రతిష్టించారు. భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరించారు. అనంతరం పార్లమెంట్​ ప్రాంగణంలో సర్వ ధర్మ ప్రార్థనలు జరిగాయి.

హై సెక్యూరిటీ మధ్య పార్లమెంట్​ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దిల్లీ వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు.