Gujarat assembly elections : 16 సీట్ల కోసం నాలుగు పార్టీల పోరాటం.. గెలుపెవరిది?
04 December 2022, 12:27 IST
Gujarat assembly elections : గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో 16 సీట్లు హాట్టాపిగ్గా మారాయి.
అహ్మదాబాద్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు
Gujarat assembly elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని 16 సీట్లు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. వాటిని మరోమారు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. మెరుగైన ప్రదర్శన చేసేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఈ రెండు పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, ఏఐఎంఐఎంలు కూడా బరిలో దిగాయి.
16 సీట్లు.. 4 పార్టీలు..
అహ్మదాబాద్ అర్బన్లోని 16 సీట్లు బీజేపీకి చాలా కీలకంగా మారాయి. 1990 నుంచి ఇక్కడ పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది, గెలుపు కమలదళంవైపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి! ఆమ్ ఆద్మీ, ఏఐఎంఐఎం కూడా బరిలో దిగి.. పోటీని మరింత రసవత్తరంగా మార్చాయి.
Gujarat assembly elections 2nd phase : ఈ 16 సీట్లల్లో ప్రస్తుతం బీజేపీ వద్ద 12 స్థానాలు ఉన్నాయి. 2012లో కేవలం రెండు సీట్లే దక్కించుకున్న కాంగ్రెస్.. 2017 ఎన్నికల్లో నాలుగు స్థానాలను వెనకేసుకుంది. ఇక ఇప్పుడు, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ అద్మీ పార్టీలు.. అన్ని స్థానాల్లో పోటీకి దిగాయి. ఏఐఎంఐఎం మాత్రం నాలుగు సీట్లల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ 16సీట్లల్లో ఈసారి కూడా బీజేపీదే పైచేయి! ఆప్ అంత ప్రభావం చూపకపోవచ్చు. కాంగ్రెస్ ఓట్లు మాత్రం.. ఏఐఎంఐఎం చీల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. బీజేపీకి లాభం చేకూరుతుంది.
బీజేపీ ప్రత్యేక శ్రద్ధ..!
Gujarat assembly elections BJP : గుజరాత్లో ఎన్నికలను ఎప్పుడూ ప్రతిష్ఠాత్మకంగా భావించే కమలదళం.. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ 16 సీట్లపై బీజేపీకి చాలా పట్టు ఉంది. కొన్ని.. బీజేపీకి కంచుకోటల్లాగా కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. కమలదళం ఎక్కడా అశ్రద్ధ వహించలేదు. ముఖ్యంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన సొంత రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రచారాలు చేశారు. డిసెంబర్ 1,2 తేదీల్లో రికార్డు స్థాయి రోడ్షోను నిర్వహించి ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచారు. మొత్తం మీద అహ్మదబాద్లోని 13 నియోజకవర్గాలను ఈ రోడ్షో చుట్టేసింది. మోదీని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివెళ్లారు.
2002-2014 మధ్యలో గుజరాత్లోని మనీనగర్ నుంచి అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు మోదీ.ఈ ప్రాంతం.. బీజేపీకి కంచుకోటగా ఉంది. మనీనగర్తో పాటు పటీదారులు ఎక్కువగా ఉండే ఘట్లోడియా నియోజకవర్గం కూడా ఈ 16 సీట్లల్లో కీలకంగా ఉన్నాయి. ఘట్లోడియాతో పాటు థక్కర్బాపా నగర్, సబర్మతి, మనీనగర్, నికోల్, నరోడా ప్రాంతాలపై పటీదారులకు పట్టు ఉంది. జమల్పూర్-ఖాడియా, దరియాపూర్ సీట్లను ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయగలరు. వెజల్పూర్, ధనిలిమ్డ(ఎస్సీ) నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్లో తొలి దశ పోలింగ్ డిసెంబర్ 1న ముగిసింది. సోమవారం రెండో దశ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో దశలో 89 సీట్లు పోలింగ్కు వెళ్లనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.