తెలుగు న్యూస్  /  National International  /  Cyclone Mandous Completes Landfall, Uproots Trees, Leaves Chennai Roads Waterlogged

Cyclone Mandous landfall : తీరం దాటిన మాండూస్​.. అల్లకల్లోలంగా చెన్నై!

10 December 2022, 8:46 IST

  • Cyclone Mandous landfall : తీరం దాటుతూనే.. మాండూస్​ తుపాను చెన్నై వీధుల్లో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా చెన్నై సహా తమిళనాడులోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

చెన్నై వీధుల్లో మాండూస్​ ఎఫెక్ట్​..
చెన్నై వీధుల్లో మాండూస్​ ఎఫెక్ట్​..

చెన్నై వీధుల్లో మాండూస్​ ఎఫెక్ట్​..

Cyclone Mandous landfall : మాండూస్​ తుపాను ధాటికి తమిళనాడు విలవిలలాడుతోంది. ముఖ్యంగా చెన్నై వీధుల్లో తుపాను అల్లకల్లోలాన్ని సృష్టించింది! 200కుపైగా చెట్లు కూలాయి. విద్యుత్​ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మాండూస్​ తుపాను.. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 సమయంలో పుదుచ్చేరి- శ్రీహరికోట సమీపంలో తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 75 కి.మీల వేగంతో గాలులు వీచాయి. ఆ తర్వాత తుపాను చెన్నైని తాకింది. మాండూస్​ ధాటికి.. శనివారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు చెన్నైలో 115.1ఎంఎం వర్షపాతం నమోదైంది.

Cyclone Mandous live updates : భారీ వర్షాల కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈస్ట్​ కోస్ట్​ రోడ్​, జీఎస్​టీ రోడ్​ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అయితే.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో భారీ ముప్పు తప్పింది.

తుపాను తీరాన్ని తాకకముందే.. 13 దేశీయ, 3 విదేశీ విమానాలను రద్దు చేస్తున్నట్టు చెన్నై విమానాశ్రయం ప్రకటించింది. ప్యాసింజర్లు.. విమానాశ్రయం నుంచి అప్డేట్స్​ పొందాలని సూచించింది.

Cyclone Mandous tracker : అయితే.. తీరాన్ని దాటి చెన్నైని తాకిన తర్వాత.. మాండూస్​ తుపాను బలహీనపడినట్టు తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా మారి, మరింత బలహీన పడుతుందని సమాచారం. బలహీన పడినప్పటికీ.. చెంగల్​పట్టు, కాంచీపూరం, విలుపురం వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ప్రాంతాలు రెడ్​ అలర్ట్​ లిస్ట్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 12 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.

10 జిల్లాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను మోహరించిన తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 5వేలకుపైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తుపాను తీవ్రత అధికంగా ఉన్న చెంగల్​పట్టులోనే 1,058 కుటుంబాలు 28 శిబిరాలకు తరలివెళ్లిపోయారు. అదే సమయంలో 16వేల మంది పోలీసు సిబ్బంది, 1500 మంది హోం గార్డులు, 40మంది సభ్యులతో కూడిన తమిళనాడు డిసాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ను.. ప్రజల భద్రత కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించింది. ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ సూచించారు.

Cyclone Mandous Chennai news : 1891 నుంచి 2021 వరకు చెన్నై- పుదుచ్చేరి మధ్య 12 తుపానులు తీరాన్ని తాకాయి. మాండూస్​ తుపాను 13వది అని భారత వాతావరణశాఖ ప్రాంతీయ కేంద్రం హెడ్​ ఎస్​ బాలచంద్రన్​ పేర్కొన్నారు.

మాండూస్​ తుపాను కారణంగా అటు ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.