తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fake It Job Offers : విదేశాల్లో 'ఫేక్​’ ఐటీ జాబ్స్​తో తస్మాత్​ జాగ్రత్త..!

Fake IT job offers : విదేశాల్లో 'ఫేక్​’ ఐటీ జాబ్స్​తో తస్మాత్​ జాగ్రత్త..!

Sharath Chitturi HT Telugu

24 September 2022, 13:44 IST

    • Beware of fake IT job offers : మయన్మార్​, థాయ్​లాండ్​ నుంచి ఐటీ ఉద్యోగాల ఆఫర్లు వస్తున్నాయని, అవి ఫేక్​ అని కేంద్రం వెల్లడించింది. ఇలా అనేకమంది భారతీయులు మోసపోయారని, అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్లపై తస్మాత్​ జాగ్రత్త..!
ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్లపై తస్మాత్​ జాగ్రత్త..!

ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్లపై తస్మాత్​ జాగ్రత్త..!

Centre advisory on fake IT job offers : ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. తప్పుడు సంస్థల పేరుతో థాయ్​లాండ్​, మయన్మార్​లలో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొందరు భారీగా మోసం చేస్తున్నారని హెచ్చరించింది.

వాస్తవానికి విదేశాల్లో ఫేక్​ ఐటీ జాబ్​ ఆఫర్స్​ వ్యవహారం గత కొంతకాలంగా ఇండియాలో సమస్యగా మారింది. ఉద్యోగానికి ఆశ పడి చాలా మంది ముందు వెనక చూసుకోకుండా.. లక్షల కొద్ది డబ్బులు అప్పజెబుతున్నారు. అలా డబ్బులు కట్టిన వారిని మయన్మార్​కు తీసుకెళ్లి కూలీల కింద వాడుకుంటున్న ఉదంతాలు బయటకొచ్చాయి. ఈ విధంగా మోసపోతున్నారు. ఈ విషయంపై రెండు రోజుల క్రితమే.. విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్​ బగ్చి సైతం స్పందించారు. థాయ్​లాండ్, మయన్మార్​​లో ఉద్యోగాల విషయంలో జ్రాగత్తగా ఉండాలని భారత యువతకు సూచించారు.​

Fake IT jobs Myanmar : "ఈ విధంగా చాలా మంది థాయ్​లాండ్​, మయన్మార్​కు వెళుతున్నారు. మయన్మార్​లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కూలీలుగా ఉన్న 30మందిని మేము రక్షించాము. ఇంకో 80-90మంది అక్కడే ఉండొచ్చు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. భద్రతా పరమైన సమస్యలు ఉండటంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా ఉన్నాయి. అందరు జాగ్రత్తగా ఉండాలి. ఫేక్​ ఐటీ జాబ్​లను నమ్మకూడదు," అని విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు.

ఇక తాజాగా శనివారం కేంద్రం విడుదల చేసిన అడ్వైజరీ సైతం.. ఆయా జాబ్​ రాకెట్లతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించి, మోసం చేస్తున్నారని పేర్కొంది. సోషల్​ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి మోసపోకూడదని, వాటిని నమ్మవద్దని సూచించింది.

Fake IT jobs Thailand : "ఉద్యోగాల కోసం టూరిస్ట్​ వీసాల మీద వెళ్లాలని అనుకుంటున్న భారతీయులకు అలర్ట్​. ఆ విదేశీ యాజమాన్యంపై పక్కా సమాచారం తీసుకోవాలి. ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలి," అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మయన్మార్​లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై అడ్వైజరీని జారీ చేసింది. మయన్మార్​లోని తూర్పు సరిహద్దు కేంద్రంగా డిజిటల్​ స్కామింగ్​కు పాల్పడుతున్న పలు కంపెనీల పేర్లను బయటపెట్టింది.

తదుపరి వ్యాసం