తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

HT Telugu Desk HT Telugu

14 February 2022, 16:13 IST

    • Delhi crime news | 87ఏళ్ల వృద్ధురాలు.. అత్యాచారానికి గురైన సంఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. తిలక్​నగర్​లో నివాసముంటున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాలపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తన తల్లిని అత్యాచారం చేసినట్టు.. ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం! (hindustan times)

దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

Tilak Nagar rape incident | దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 87ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఎవరూ లేని సమయంలో..

తిలక్​ నగర్​లో ఓ 87ఏళ్ల వృద్ధురాలు.. తన 65ఏళ్ల కుమార్తెతో నివాసముంటోంది. ఆదివారం మధ్యాహ్నం పని మీద కుమార్తె బయటకు వెళ్లింది.

ఇంతలో ఓ వ్యక్తి.. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయాడు.

కొంతసేపటికి కుమార్తె తిరిగి ఇంటికి వచ్చింది. చిరిగిపోయిన దుస్తుల్లో తల్లి ఉండటం చూసి షాక్​ అయ్యింది. ఇంట్లో కొన్ని వస్తువులు అదృశ్యమయ్యాయని గమనించింది. ఎవరో వచ్చి దొంగతనం చేశారని భావించి.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మొబైల్​ ఫోన్​ పోయిందని ఫిర్యాదులో పేర్కొంది. స్పందించిన పోలీసులు.. సంబంధిత సెక్షన్లతో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఆ 65ఏళ్ల మహిళ.. సోమవారం మళ్లీ పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తన 87ఏళ్ల తల్లిపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్​ఐఆర్​లో మరిన్ని సెక్షన్లు జోడించారు.

మరోవైపు బాధితురాలికి కౌన్సిలింగ్​ ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు.

ఉన్మాది ‘ప్రేమ’కు మహిళ బలి..

గుజరాత్​లోని సూరత్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ మహిళను గొంతుకోసి చంపేశాడు ఓ ఉన్మాది. అడ్డొచ్చిన మహిళ కుటుంబసభ్యులను గాయపరిచాడు. చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

Surat crime news | ఫెనిల్ ​గోయాని, గ్రీష్మ వెకారియా(21)లు ఒకే స్కూల్​లో చదువుకున్నారు. తన ప్రేమను అంగీకరించాలని గ్రీష్మ వెంట ఎన్నోసార్లు తిరిగాడు గోయాని. అందుకు గ్రీష్మ ఒప్పుకోలేదు. ఆమె కుటుంబసభ్యులు సైతం గోయానిని అంగీకరించలేదు.

కామ్​రేజ్​ ప్రాంతంలో.. శనివారం సాయంత్రం 6గంటల సమయంలో.. గ్రీష్మ మేనమామ.. గోయానిని మందలించాడు. తమ బిడ్డ వెంటపడొద్దని తేల్చిచెప్పాడు. కానీ గోయాని వినలేదు. చేతిలో ఉన్న కత్తితో ఆతనిని పొడిచాడు. సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. కానీ గ్రీష్మను పట్టుకున్న ఆ ఉన్మాది.. చేతిలో ఉన్న కత్తితో.. ఆమె గొంతు కోసేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతటితో ఆగకుండా.. ఆ మహిళ సోదరుడిని సైతం గాయపరిచాడు. చివరికి గోయాని ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. కత్తితో తన చేతిని కోసుకున్నాడు. విషం తాగేందుకు యత్నించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. గోయానిని అరెస్ట్​ చేసి ఆసుపత్రికి తరలించారు.