తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel: ‘సముద్రం మధ్య’: తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. నయా లుక్ రిలీజ్

Thandel: ‘సముద్రం మధ్య’: తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. నయా లుక్ రిలీజ్

26 December 2023, 11:52 IST

    • Thandel Movie: తండేల్ సినిమా షూటింగ్‍పై మూవీ యూనిట్ అప్‍డేట్ ఇచ్చింది. కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్
తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్

తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్

Thandel Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. మత్స్యకారుడిగా ఈ చిత్రంలో చైతూ కనిపించనున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. చిత్రీకరణ కంటే ముందే తండేల్ కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తులు చేసింది. కాగా, ఇప్పుడు తండేల్ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

తండేల్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఓడల మధ్య నాగచైతన్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. “సముద్రం మధ్య ఉత్కంఠభరితమైన షెడ్యూల్‍ను తండేల్ టీమ్ మొదలుపెట్టింది. షూటింగ్ జరుగుతోంది” అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే మరిన్ని ఎగ్జైటింగ్ అప్‍డేట్లను ఇస్తామని పేర్కొంది.

తండేల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉడిపిలో జరుగుతోంది. మాల్పే పోర్టు సమీపంలో చిత్రీకరణ జరుగుతుండగా.. ఇటీవలే ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మత్స్యకారుడి పాత్రకు తగట్టు నాగ చైతన్య మేకోవర్ అయ్యారు.

ఇటీవలే తండేల్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నాగచైతన్య తండ్రి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య - సాయి పల్లవి రెండోసారి తండేల్ మూవీలో హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో తండేల్ రూపొందుతోంది.

2018లో గుజరాత్‍లో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‍ దళాల చేతికి చిక్కారు 22 మంది శ్రీకాకుళం, విజయనగరం జాలర్లు. ఆ తర్వాత భారత ప్రభుత్వం చర్చలు జరపటంతో సుమారు రెండున్నరేళ్ల తర్వాత వారిని పాక్ విడిచిపెట్టింది. దీంతో వారు స్వదేశానికి వచ్చారు. ఈ యథార్థ ఘటన ఆధారంగానే తండేల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రేమ కథ కూడా ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. 2024లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‍గా పెట్టుకున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం