తెలుగు న్యూస్  /  Entertainment  /  Riddhi Kumar Is Third Heroin In Prabhas And Maruthi Movie

Prabhas and Maruthi Movie: ప్రభాస్-మారుతీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరంటే?

26 November 2022, 22:26 IST

    • Prabhas and Maruthi Movie: రెబల్ స్టార్ ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు చేస్తున్నారు. ఇప్పటికే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తుండగా.. మరో హీరోయిన్‌గా రిద్ధికుమార్ ఎంపికైంది.
ప్రభాస్-మారుతీ సినిమాలో మరో హీరోయిన్‌గా రిద్ధికుమార్
ప్రభాస్-మారుతీ సినిమాలో మరో హీరోయిన్‌గా రిద్ధికుమార్

ప్రభాస్-మారుతీ సినిమాలో మరో హీరోయిన్‌గా రిద్ధికుమార్

Prabhas and Maruthi Movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే లాంటి చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న మన డార్లింగ్.. మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Thalapathy Vijay Re-release movie: రీరిలీజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న దళపతి విజయ్ మూవీ.. రజనీకాంత్‌నే మించిపోయాడు

Kalki Release: యూట్యూబ్‌లో రిలీజైన సూప‌ర్ యాక్ష‌న్ మూవీ క‌ల్కి - రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోన్న తెలుగు సినిమా

Top IMDb adventure movies on ott: ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..

Asura Guru Telugu OTT: తెలుగులో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్న కోలీవుడ్ యాక్ష‌న్ మూవీ అసుర గురు

ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా చేయనుందట. ఆమె ఎవరో కాదు రిద్ధి కుమార్. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటించింది. రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన వ్యక్తిగా ఆమె అలరించింది. తాజాగా ప్రభాస్- మారుతీ కాంబోలో రానున్న ఈ చిత్రంలో కనిపించనుందిట.

ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో మన డార్లింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. తాత, మనవడు ఇద్దరి పాత్రల్లోనూ ప్రభాస్ కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలో ఉంది. పాత థియేటర్‌లో దాచిన నిధిన వెలికితీసే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట నిర్మాతలు. వీఎఫ్ఎక్స్ కోసం భారీ స్థాయిలో ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్‌ల బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ఆదిపురుష్ చిత్రంలోనూ విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలతో పాటు అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే కంప్లీట్ చేయనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.