తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakhi Sawant Breaks With Adil: ఆదిల్ నువ్వు నా తల్లిని చంపావ్.. భర్తపై సంచలన ఆరోపణలు చేసిన రాఖీ సావంత్

Rakhi Sawant breaks with Adil: ఆదిల్ నువ్వు నా తల్లిని చంపావ్.. భర్తపై సంచలన ఆరోపణలు చేసిన రాఖీ సావంత్

07 February 2023, 8:10 IST

    • Rakhi Sawant breaks with Adil: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ దురానీతో విడిపోయినట్లు తెలిపింది. అతడు తనను దారుణంగా మోసం చేశాడని, తన తల్లికి కారణమయ్యాడని సంచలన ఆరోపణలు చేసింది.
రాఖీ సావంత్
రాఖీ సావంత్

రాఖీ సావంత్

Rakhi Sawant breaks with Adil: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ పెళ్లి మూణ్మాళ్ల ముచ్చటే అయింది. తన భర్త ఆదిల్ ఖాన్‌ దురానీకి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని సంచలన ఆరోపణలు చేసిన రాఖీ.. తాజాగా అతడు తనతో విడిపోయానని చెప్పాడని స్పష్టం చేసింది. దీంతో ఆదిల్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. అతడో పచ్చి మోసగాడని, తన తల్లి చావుకు కూడా అతడే కారణమని షాకింగ్ కామెంట్లు చేసింది. బాలీవుడ్‌లో ఎంట్రీ కోసమే తనకు చేరువయ్యాడని, ఇప్పుడు తను అనే మరో అమ్మాయితో వ్యవహారం నడుపుతున్నాడని ఘాటు విమర్శలు చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Response: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

Baak OTT: ఓటీటీలోకి తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీ బాక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Thalaimai Seyalagam OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్న శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. డేట్ ఇదే

"ఎట్టకేలకు ఆదిల్ నన్ను వదిలేసేందుకు నిర్ణయించుకున్నాడు. అతడు నాతో నేను నిన్న వదిలి తను దగ్గరకు వెళ్తున్నాను. నేను ఆమెతోనే ఉంటానని చెప్పాడు. బాలీవుడ్‌లో ఎంట్రీ కోసమే నన్ను ఓ నిచ్చెన లాగా వాడుకున్నాడు. నా వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. నన్ను ఎమోషనల్‌గా, మానసికంగా, భౌతికంగా ఉపయోగించుకున్నాడు. అతడి నుంచి ఎంతో టార్చర్ అనుభవించాను. అతడిపై మైసూర్‌లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పెళ్లి తర్వాత తెలిసింది." అని రాఖీ సావంత్ స్పష్టం చేసింది.

ఆదిల్ తన తల్లి చావుకు కారణమయ్యాడని, అతడి వల్ల ఆమె మరణించిందని షాకింగ్ కామెంట్లు చేసింది రాఖీ.

"ఆదిల్ నువ్వు నా తల్లిని చంపావు. మా అమ్మకు సకాలంలో వైద్య చికిత్స అందినట్లయితే తను ఈ రోజు బతికుండేది. నాకు ఎలాంటి ఆప్షన్లు కూడా విడిచిపెట్టావు. నన్ను మోసగించి నడి వీధుల్లోకి తీసుకొచ్చావు." అని రాఖీ తెలిపింది.

బిగ్‌బాస్ మరాఠీ షోలో పాల్గొన్నందుకు వచ్చిన రూ.10 లక్షల చెక్‌ను ఆదిల్‌కు ఇచ్చానని, ఆ సొమ్మును తన తల్లి చికిత్స కోసం వాడమని చెబితే అతడు ఉపయోగించలేదని రాఖీ వాపోయింది.

"మా అమ్మ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అకౌంట్‌లో డబ్బుంది. కానీ అతడు ఆ సొమ్మును ఆమె చికిత్స కోసం ఉపయోగించలేదు. నా తల్లి ఎలా మరణించిందనుకుంటున్నారు? ఆదిల్ ఖాన్ దురానీ వల్లే మరణించారు. అతడు చిన్న సర్జరీ కోసం డబ్బు ఖర్చు పెట్టి ఉన్నట్లయితే ఈ రోజు మా అమ్మ బతికి ఉండేది. అది నా డబ్బు. సొమ్ము కోసమే నా వెంటపడ్డాడు" అని రాఖీ స్పష్టం చేసింది.

ఆదిల్ అఫైర్ గురించి మాట్లాడుతూ.. తన మోసం చేశాడని రాఖీ తెలిపింది. "వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ కూడా ఉంది. ఇందుకు సంబంధించి వారి హోటెల్ బిల్లులు, ఎయిర్‌వే ప్రూఫ్స్ నా వద్ద ఉన్నాయి. ఇదే విషయం నేను ఆ అమ్మాయిని అడిగాను. పెళ్లయిన వ్యక్తితో అఫైర్ పెట్టుకోడానికి సిగ్గులేదా? అని మండిపడ్డాను. ఇందుకు ఆమె నేను అతడి ప్రేమలో పడిపోయానని చెప్పింది. ఇదే విషయాన్ని ఆదిల్‌ను నిలదీస్తే అవును కూడా నాకు అఫైర్ ఉందని, తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కొంత సమయం కావాలని కూడా అడిగాడు. చివరకు ఇల్లు వదిలి పెట్టి నా దగ్గరున్న రూ.4 లక్షలు, నా తల్లి నగలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయంపై నేను చట్టపరమైన సాయం తీసుకుంటాను." అని రాఖీ తెలిపింది.

తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు రాఖీ సావంత్ జనవరిలో ప్రకటించింది. వీరిద్దరూ గతేడాది జులై 2నే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఇటీవలే రాఖీ సావంత్ తల్లి మరణించడం, ఆదిల్ ఖాన్‌పై షాకింగ్ కామెంట్లు చేయడం వల్ల ఈ ముద్దుగుమ్మ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.