తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: మేనల్లుడితో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: మేనల్లుడితో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్...

HT Telugu Desk HT Telugu

25 June 2022, 9:49 IST

  • మెగా మామాఅల్లుళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ తొలిసారి క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. త‌మిళ చిత్రం వినోద‌య సీత‌మ్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,సాయిధ‌ర‌మ్‌తేజ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,సాయిధ‌ర‌మ్‌తేజ్ (twitter)

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,సాయిధ‌ర‌మ్‌తేజ్

రాజ‌కీయాల‌పై దృష్టిసారిస్తూనే సినిమాల‌కు స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్(pawan kalyan). ప్ర‌స్తుతం పవన్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు(harihara veera mallu) సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సినిమాను సెట్స్‌పైకితీసుకొచ్చాడు. వినోధయ‌సీత‌మ్ త‌మిళ రీమేక్ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టారు. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్(saidharam tej) మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. సింపుల్‌గా ఈ వేడుక‌ను జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫాంట‌సీ క‌థాంశంతో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఓ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వ్య‌క్తి దేవుడి వ‌రంతో తిరిగి జీవితాన్ని పొంది మూడు నెలల్లో త‌న బాధ్య‌త‌ల్ని ఎలా నెర‌వేర్చాడ‌నే పాయింట్‌తో స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ప‌లు మార్పులు చేస్తూ స‌ముద్ర‌ఖ‌ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. ఇందులో దేవుడి పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. భ‌క్తుడిగా సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న‌ట్లు తెలిసింది.

ఈ సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇర‌వై రోజులు డేట్స్‌ను కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. ఇందు కోసం యాభై కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలిసింది. జూలై తొలివారంలో ఈ రీమేక్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం. జూలై నెలాఖ‌రున ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. జూలై ఎండింగ్ నుండి ఆగ‌స్ట్ మిడిల్‌ వ‌ర‌కు ఆయ‌న పాత్ర తాలూకు ఎపిసోడ్స్ ను చిత్రీక‌రిస్తార‌ని అంటున్నారు. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం