తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan: సిద్ధార్థ మల్హోత్రాను మొదట ఎప్పుడు కలిసిందో చెప్పిన కియారా

Koffee With Karan: సిద్ధార్థ మల్హోత్రాను మొదట ఎప్పుడు కలిసిందో చెప్పిన కియారా

25 August 2022, 16:09 IST

    • కాఫీ విత్ కరణ్ 7వ ఎడిషన్‌ తాజా ఎపిసోడ్‌లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ పాల్గొన్నారు. ఈ షో వ్యాఖ్యాత కరణ్ జోహార్.. వారిని ఆసక్తికర విషయాలను అడిగాడు. కియారా తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ గురించి కొన్ని విషయాలను షేర్ చేసింది.
సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ
సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ (Twitter)

సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ

బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ దిగ్విజయంగా ప్రసారమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ షో వస్తోంది. ఇప్పటికే పలువురు సమంత, విజయ్ దేవరకొండ సహా పలువురు యాక్టర్లు ఈ షోలో పాల్గొనగా తాజాగా.. షాహిద్ కపూర్, కియారా అద్వానీ పాల్గొన్నారు. ఈ షోలో వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కియారా.. రూమర్ బాయ్ ఫ్రెండ్‌గా చెబుతున్న సిద్ధార్థ మల్హోత్రా గురించి కొన్ని విషయాలను అడిగాడు షో వ్యాఖ్యాత కరణ్.

ట్రెండింగ్ వార్తలు

Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

ఈ షోలో బింగో రౌండులో భాగంగా నీకు నచ్చిన బహుమతి సిద్ధార్థ ఏం ఇచ్చాడు అనే ప్రశ్నను కరణ్‌ను కియారాను అడగ్గా.. ఇందుకు ఆమె నేను అసహ్యించుకునే ఏ గిఫ్ట్ సిద్ ఇవ్వలేదని బదులిచ్చింది. అలాగే తనకు స్టఫ్డ్ టాయ్స్ అంటే అసహ్యమని తెలిపింది. పక్కనే ఉన్న షాహిద్.. ఆమెకు ఖరీదైన డిజైనర్ బ్యాగులంటే ఇష్టమని చెప్పగా.. అస్సలు కాదని కియారా స్పందించింది.

సిద్ధార్థ్‌తో తన మొదటి కలిసిన విషయం గురించి కియారా ఈ షోలో తెలియజేసింది. "సిద్, నేను షేర్షా చిత్రంలో నటించడానికి ముందే ఇద్దరం ఒకరికొకరం తెలుసు. అయితే హాయ్ అని మాత్రమే మాట్లాడుకునే వాళ్లం. ఆ సినిమాతో మా ఇద్దరి మధ్య ఎక్కువగా మాటలు నడిచాయి. లస్ట్ స్టోరీస్ షూట్ అయిపోయిన తర్వాత నీతో పాటు సిద్ కూడా పార్టీలో ఉన్నాడు.. అదే మా మొదటి మీటింగ్. అప్పుడు సాధారణంగా కలిశాం అని ఆమె స్పష్టం చేసింది.

కొన్ని రోజుల క్రితం కరణ్ జోహార్‌తో శశాంక్ ఖైతాన్ రొమాటింక్ కామెడీ కోసం కియారా.. సిద్ధార్థతో మళ్లీ మరోసారి కలిసి నటించనుంది. ఇది కాకుండా గోవింద నామ్ మేరాలో విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత ఆమె శంకర్-రామ్ చరణ్‌ కాంబోలో రానున్న RC15లో చేయనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం