తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kareena Kapoor: నా వల్ల భారత రైల్వే రెవిన్యూ పెరిగింది.. కరీనా సంచలన వ్యాఖ్యలు

Kareena kapoor: నా వల్ల భారత రైల్వే రెవిన్యూ పెరిగింది.. కరీనా సంచలన వ్యాఖ్యలు

20 August 2022, 7:53 IST

    • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా.. తన వల్ల భారత రైల్వేస్ రెవిన్యూ పెరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను నటించిన జబ్ వీ మెట్ సినిమాలోని తన పాత్ర గీత్ కారణంగా రైల్వే ఆదాయం పెరిగిందని తెలిపింది.
కరీనా కపూర్
కరీనా కపూర్ (ANI)

కరీనా కపూర్

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే లాల్ సింగ్ చడ్ఢా సినిమాతో కాస్త్ గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత కాస్త స్లో అయిన ఈ అమ్మడు.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ రైల్వేస్‌కు తన వల్లే ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. తాను నటించిన జబ్ వీ మెట్ సినిమా కారణంగా రెవిన్యూ పెరిగిందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

ఇదంతా నిజంగా కాదులేండి.. ప్రముఖ హిందీ కోర్ట్ రూం కామెడీ షో కేస్ తో బన్తా హై అనే షోలో పాల్గొన్న కరీనా.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన జబ్ వీ మెట్ చిత్రంలో తన పాత్ర గీత్ వల్లే ఇండియన్ రైల్వేస్ ఆదాయంపెరిగిందని స్పష్టం చేసింది.

ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా గీత్‌గా నటించింది. నిరాశతో కుంగిపోయిన ఆదిత్య కశ్యప్(షాహిద్ కపూర్)ను ఓ రైలులో కలిసిన గీత్.. అతడితో ఉల్లాసంగా మాట్లాడి మార్పు తీసుకొస్తుంది. సినిమా మొదటి అర్ధభాగమంతా రైలులోనే నడుస్తుంది. గీత్ రెండు సార్లు రైలును మిస్సవడం, భారతీయ రైల్వే ఉద్యోగికి అనుచిత సలహాలు ఇవ్వడం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ఎక్కువ భాగం రైలులో నడవడం వల్ల కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతటితో ఆగకుండా ఈ సినిమాలో తాను ధరించిన దుస్తుల కారణంగా హరేమ్ ప్యాంట్ల సేల్‌ కూడా పెరిగిందని స్పష్టం చేసింది. తన ఒక్క సినిమా వల్ల ఇండియన్ రైల్వేస్ ఆదాయంతో పాటు హారెం ప్యాంట్ల విక్రయాలు పెరిగినట్లు ఈ కోర్టు రూం కామెడీ షోలో తన వాదనను వినిపించింది.

ఈ షోలో రితేశ్ దేశ్‌ముఖ్ పబ్లిక్ న్యాయవాదిగా నటించాడు. కుషా కపిలా జడ్జిగా అలిరించగా.. ముద్దాయిగా కరీనా కపూర్ తన వాదనను వినిపించింది. వరుణ్ శర్మ ముద్దాయి తరఫున డిఫెన్స్ లాయర్‌ పాత్రను పోషించారు. గోపాల్ దత్, పారితోష్ త్రిపాఠి, మోనికా మూర్తి, సంకేత్ భోంస్లే, సుగంధ మిశ్రా, సిద్ధార్థ్ సాగర్ తదిరులు సాక్షులుగా వ్యవహరించారు. ఈ అమెజాన్ మినీ టీవీ షోలో ఇంతకుముందు అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం