తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan | చరణ్‌పై వినూత్న అభిమానం.. 264 కిలోమీటర్ల పాదయాత్ర

Ram Charan | చరణ్‌పై వినూత్న అభిమానం.. 264 కిలోమీటర్ల పాదయాత్ర

28 May 2022, 23:03 IST

    • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఓ వ్యక్తి వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడుచుకుంటూ చరణ్ నివాసానికి చేరుకున్నాడు. అంతేకాకుండా చరణ్ ముఖ చిత్రం ఆకృతిలో పండించిన బియ్యాన్ని ఆయనకు కానుకగా ఇచ్చాడు.
అభిమానితో రామ్ చరణ్
అభిమానితో రామ్ చరణ్ (Twitter)

అభిమానితో రామ్ చరణ్

తెలుగు వారికి సినిమా అంటే అదో ప్రపంచం. హీరోలను అభిమానించడం మొదలు పెడితే దేవుళ్ల మాదిరిగా ఆరాధిస్తుంటారు. వారిపై అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటుంటారు. అయితే ఇప్పటి వరకు నచ్చిన హీరో కోసం పచ్చబొట్టు వేసుకోవడమో, అభిమాన హీరో పుట్టినరోజున రక్తదానాలు చేయడం లాంటివి చూసుంటాం. కానీ ఓ వ్యక్తి తన అభిమాన కథానాయికుడి కోసం 264 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

ట్రెండింగ్ వార్తలు

Double Ismart Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్ అదుర్స్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

రామ్ చరణ్ కోసం ఓ వ్యక్తి 264 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. గద్వాల్‌కు చెందిన జైరాజ్ అనే యువకుడు తన అరెకరం పొలంలో వరి పంట వేశాడు. పంటను రామ్ చరణ్ ముఖచిత్రం ఆకారంలో సాగు చేసి అందులో పండిన ధాన్యాన్ని చరణ్‌కు కానుకగా ఇచ్చాడు. అందుకోసం ఏకంగా 264 కిలోమీటర్ల నడుచుకుంటూ హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి చేరుకున్నాడు.

తన కోసం ఇంత చేసిన అభిమానిని సాదరంగా ఆహ్వానించారు చరణ్. తన నివాసంలో అతడిని కలిసి కాసేపు ముచ్చటించాడు. తన ముఖచిత్రం ఆకారంలో వరి పంట సాగు చేసి పండించిన ధాన్యాన్ని చరణ్ తీసుకున్నాడు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన తర్వాతి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో కియరా అద్వానీ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

<p>రామ్ చరణ్&nbsp;</p>

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం