తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Seb : రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్న సెబ్- రూ.118.93 కోట్ల మద్యం, డ్రగ్స్ సీజ్

AP SEB : రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్న సెబ్- రూ.118.93 కోట్ల మద్యం, డ్రగ్స్ సీజ్

29 April 2024, 22:45 IST

    • AP SEB : ఏపీలో అక్రమ మద్యం, డ్రగ్స్ ను అరికట్టేందుకు సెబ్ నిరంతరం పనిచేస్తుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ముమ్మర తనిఖీలు చేస్తున్న సెబ్ ఇప్పటి వరకూ రూ.118.93 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ సీజ్ చేసింది.
రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్న సెబ్
రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్న సెబ్

రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్న సెబ్

AP SEB : ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెబ్(SEB) అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసులు, సెబ్ అధికారులు కర్ణాటక, తెలంగాణ, గోవా నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)ను అరికట్టడంపై దృష్టి సారించారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ సరిహద్దుల్లో 31 ఇంటిగ్రేటెడ్‌తో సహా మొత్తం 150 చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసు, సెబ్, వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు ఈ చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నారు. సెబ్ 29 చెక్‌పోస్టులు, 15 బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్‌ను నిర్వహిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

పాత నేరస్థులపై పీడీ యాక్ట్

సెబ్ పోలీసులు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్‌తో కలిసి పనిచేస్తుంది. డిపార్ట్‌మెంట్, APSBCL ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను సేకరించి అక్రమ మద్యాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది.

రాష్ట్ర సరిహద్దులో స్మగ్లింగ్, మద్యం తరలింపు, డ్యూటీ చెల్లించని లేదా నకిలీ మద్యం పంపిణీ అరికట్టేందుకు సెబ్ నిరంతరం పనిచేస్తుంది. SEB, పోలీసులు అక్రమ మద్యం తరలించే ప్రాంతాలను మ్యాప్ చేసేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. జియో ట్యాగింగ్ కోసం టైమ్ స్టాంప్ , భౌగోళిక డేటాను విశ్లేషిస్తాయి. ఎన్నికల నేపథ్యంలో వివిధ భద్రతా కారణాలతో 39,232 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వీటిలో సెబ్ 15,696, పోలీసులు 23,536 బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 343 నేరస్థులను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 31 మంది కింగ్‌పిన్‌లు అక్రమ మద్యానికి సంబంధించినదిగా సెబ్ తెలిపింది.

రూ.118.93 కోట్ల మద్యం, డ్రగ్స సీజ్

అక్రమ మద్యం తరలింపుపై 68,312 కేసులు నమోదయ్యాయి. 66,846 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.65.14 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌కు సంబంధించి 1513 కేసులు బుక్ అయ్యారు. 5581 మందిని అరెస్టు చేసి రూ. 53.79 కోట్లు సీజ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో రూ.13.11 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మద్యం, డ్రగ్స్ విలువ రూ. 118.93 కోట్లుగా ఉంది. మద్యం విషయంలో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు తలెత్తితే ప్రజలు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (SEB)కి తెలియజేయాలని అధికారులు అభ్యర్థించారు. ఈ నెంబర్ 9491030853 సంప్రదించాలని కోరారు.

తదుపరి వ్యాసం