తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ccl 2024: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలంగాణ టూరిజం .. హీరోలు ఏం చెప్పారంటే?

CCL 2024: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలంగాణ టూరిజం .. హీరోలు ఏం చెప్పారంటే?

Sanjiv Kumar HT Telugu

01 March 2024, 8:49 IST

  • Celebrity Cricket League 2024 Telangana Tourism: తాజాగా తెలంగాణ టూరిజంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ భాగమైంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు హీరోలు సుధీర్ బాబు, అశ్విన్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్ చేశారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలంగాణ టూరిజం .. హీరోలు ఏం చెప్పారంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలంగాణ టూరిజం .. హీరోలు ఏం చెప్పారంటే?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలంగాణ టూరిజం .. హీరోలు ఏం చెప్పారంటే?

CCL 2024 Telangana Tourism: ''ఒకవైపు సినీ స్టార్స్, మరోవైపు క్రికెట్ ఈ అద్భుతమైన క్రీడా ఉత్సవానికి వేదికైన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ప్రేక్షకులకు కన్నుల పండగ. తెలంగాణ టూరిజం ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది'' అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌-సీజన్ 10 లో భాగంగా మార్చి 1వ తేదీ అంటే శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌‌లో తెలంగాణ టూరిజం భాగమైయింది.

ట్రెండింగ్ వార్తలు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ టీమ్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్‌లో "ప్రపంచ నలుమూలల సినీ, క్రీడా అభిమానులను, ప్రేక్షకులని ఈ లీగ్ ద్వారా అలరిస్తున్న 8 జట్ల సభ్యులకు, నిర్వాహకులకు అభినందనలు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. సినీ స్టార్స్ ఈ విషయంలో అవగాహన కల్పిస్తే ఆ సందేశం ప్రజలకు మరింతగా చేరువ అవుతుంది. ఇలాంటి కార్యక్రమలకు మా ప్రభుత్వం, టూరిజం సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

తెలుగు వారియర్స్ టీమ్ సభ్యుడు, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. "మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ టూరిజం సీసీఎల్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. టూరిజంను ప్రమోట్ చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం. సీసీఎల్ పదో సీజన్ ఇది. ఈ పదేళ్లలో లీగ్ గొప్పగా ఎదిగింది. విష్ణువర్ధన్‌ ఇందూరి గారికి థాంక్స్. మార్చి 1, 2 తేదిల్లో మ్యాచులు ఆడుతున్నాం. అందరూ స్టేడియంకు వచ్చి సపోర్ట్ చేయాలి" అని కోరారు.

"మాకు సపోర్ట్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ మార్చి 1, 2 తేదిల్లో మ్యాచులు ఆడబోతుంది. క్రికెట్, సినిమా లవర్స్ అందరూ వచ్చి క్రికెట్‌ని తెలుగు వారియర్స్ టీంని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని హీరో అశ్విన్ బాబు అన్నారు. "తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తాం. మార్చి 1 నుంచి మ్యాచులు ఆడుతున్నాం. మీ అందరినీ అలరిస్తాం'' అని హీరో సుశాంత్ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ.. "మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ టూరిజం సీసీఎల్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. మార్చి 1 నుంచి మ్యాచులు ఉంటాయి. క్రికెట్ లవర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి" అని కోరారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. "తెలంగాణ టూరిజంకు ధన్యవాదాలు. మా టీంను, ఈ క్రికెట్ లీగ్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. మార్చి1 ఉప్పల్‌లో కలుద్దాం'' అని పేర్కొన్నారు.

ఇవాళ అంటే మార్చి 1న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ టీమ్‌తో పంజాబ్ దే షేర్ జట్టు తలపడనుంది. దీనికి సోనుసూద్ కెప్టెన్. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇక రెండో మ్యాచ్ నటుడు జీవా కెప్టెన్సీగా ఉన్న చెన్నై రైనోస్‌తో మనోజ్ తివారీ టీమ్ భోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.

తదుపరి వ్యాసం