తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: మధ్యంతర బడ్జెట్లో ‘ఆ నాలుగు కులాల’కే ప్రాధాన్యత; వారి ప్రగతే లక్ష్యం..

Budget 2024: మధ్యంతర బడ్జెట్లో ‘ఆ నాలుగు కులాల’కే ప్రాధాన్యత; వారి ప్రగతే లక్ష్యం..

HT Telugu Desk HT Telugu

01 February 2024, 18:46 IST

  • Budget 2024: ప్రధాని అభివర్ణించిన ప్రకారం.. సమాజంలోని నాలుగు కులాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆ నాలుగు కులాలు మహిళలు, యువత, రైతులు, పేదలు అని తెలిపారు.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (ANI)

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

Four castes described by Modi: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కులాలుగా అభివర్ణించిన మహిళలు, యువత, రైతులు, పేదల సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించిందని బడ్జెట్ (BUDGET) ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. ఈ "నాలుగు కులాలు" ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువుగా ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వర్గాలు ఇవేనన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వారి ప్రగతే లక్ష్యం

విధాన నిర్ణయాల ద్వారా మహిళలు, యువత, రైతులు, పేదల స్థితిని మెరుగుపరచాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ (BUDGET) ప్రసంగంలో నొక్కిచెప్పారు. ఈ ప్రసంగంలో సైద్ధాంతిక ఆందోళన, పెరుగుతున్న భారతదేశ జనాభా గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘‘2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్)ను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ, ఆ లక్ష్యాన్ని సాధించడానికి, "మనం ప్రజల సామర్థ్యాలను మెరుగుపరచాలి. వారికి సాధికారత కల్పించాల’’ని ఆర్థిక మంత్రి అన్నారు. జనాభా విస్ఫోటనం వల్ల ఎదురవుతున్న సవాళ్లపై ఆమె మాట్లాడుతూ, వేగవంతమైన జనాభా పెరుగుదల, జనాభా మార్పుల వల్ల తలెత్తే సవాళ్లను విస్తృతంగా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

తదుపరి వ్యాసం