Tirupati Special Trains: తిరుపతికి ప్రత్యేక రైళ్లు, వయా వికారాబాద్ - వివరాలివే
Special Trains From Secunderabad : ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
సికింద్రాబాద్ - తిరుపతి
secunderabad to tirupati trains :సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. 07120 ట్రైన్ నెంబర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 31వ తేదీన సాయంత్రం 06.15 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు గమ్యస్థలానికి చేరుకుంటుంది.
tirupati to secunderabad special trains: ఇక తిరుపతి - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. 07121 ట్రైన్ నెంబర్ తిరుపతి నుంచి రాత్రి 09.10కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.30కు చేరుకుంటుంది.
వయా వికారాబాద్, గుంతకల్లు
ఈ స్పెషల్ ట్రైన్లు సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, తాండూరు, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ ట్రైన్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లోచ్, జనరల్ సెకంట్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.