గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.