JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల… 22మంది తెలుగు విద్యార్ధులకు 100శాతం స్కోర్-jee mains results released 22 telugu students scored 100 percent ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jee Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల… 22మంది తెలుగు విద్యార్ధులకు 100శాతం స్కోర్

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల… 22మంది తెలుగు విద్యార్ధులకు 100శాతం స్కోర్

Sarath chandra.B HT Telugu
Apr 25, 2024 07:36 AM IST

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం రాత్రి ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. సెషన్ 2 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22మంది 100శాతం స్కోర్ లభించింది.

 జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ 2024 (Session-2) ఫలితాలు Results విడుదల అయ్యాయి. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22మంది విద్యార్ధులకు 100శాతం NTA Score ఎన్టీఏ స్కోర్ సాధించారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్ సాధించిన వారిలో తెలుగు విద్యార్ధులే అధికంగా ఉన్నారు.

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ-మెయిన్స్ సెషన్‌ 2లో ఇద్దరు బాలికలు సహా 56 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోరు సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం రాత్రి ప్రకటించింది.

దేశంలోని 23 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల గరిష్ట స్థాయికి వీరి సంఖ్య చేరింది.

జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్‌లో 23 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోర్ సాధించగా, ఏప్రిల్ సెషన్లో 33 మంది అభ్యర్థులు దీన్ని సాధించారు.

56 మంది టాపర్లలో జనరల్ కేటగిరీ నుంచి 40 మంది విద్యార్ధులు, ఓబీసీ కేటగిరీ నుంచి 10 మంది, జనరల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఆరుగురు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన ఏ అభ్యర్థి కూడా ఈ ఏడాది 100 ఎన్టీఏ స్కోరు సాధించలేకపోయారు. ఎన్టీఏ స్కోరు, వచ్చిన మార్కుల శాతం సమానంగా లేవని అధికారులు చెబుతున్నారు.

ఎన్టీఏ స్కోర్‌లు మల్టీ సెషన్ పేపర్లలో నార్మలైజ్డ్ స్కోర్లు, ఒక సెషన్లో పరీక్షకు హాజరైన వారందరికి వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయి. వచ్చిన మార్కులను ప్రతి సెషన్ పరీక్షకు 100 నుంచి 0 వరకు స్కేల్ గా మారుస్తారు' అని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

పరీక్ష సమయంలో అనుచిత మార్గాలను ఉపయోగించినందుకు 39 మంది అభ్యర్థులను మూడేళ్ల పాటు జేఈఈ-మెయిన్ రాయకుండా నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే అమల్లో ఉన్న విధానానికి అనుగుణంగా రెండు ఎన్టీఏ స్కోర్లలో ఉత్తమమైన వాటిని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేస్తారు. టాప్ స్కోర్ జాబితాలో 15 మంది అభ్యర్థులతో తెలంగాణ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగుతోంది.

100 శాతం మార్కులతో ఏడుగురు అభ్యర్థులతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లు రెండో స్థానంలో నిలిచాయి. ఆరుగురు అభ్యర్థులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.

మొత్తం 14.1 లక్షల మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరు అయ్యారు. అభ్యర్థుల్లో దాదాపు 96 శాతం మంది జేఈఈ అడ్వాన్స్ డ్ కు అర్హత సాధించారు. మెయిన్స్ ర్యాంకులతో కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలను కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)ల్లో 24 వేల సీట్లు ఉన్నాయి.

జేఈఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహించారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో దేశంలోని 319 నగరాల్లో 571 కేంద్రాల్లో నిర్వహించారు. భారతదేశం వెలుపల 22 నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. కేప్ టౌన్, దోహా, దుబాయ్, మనామా, ఓస్లో, సింగపూర్, కౌలాలంపూర్, లాగోస్ / అబుజా, జకార్తా, వియన్నా, మాస్కో మరియు వాషింగ్టన్ డిసిల్లో కూడా జేఈఈ పరీక్షలు నిర్వహించారు.

2023లో 90.7శాతం, 2022లో 88.4శాతంగా ఉన్న జనరల్ కేటగిరీ కటాఫ్‌ మార్కులు ఈ ఏడాది కనిష్ఠ కటాఫ్ 93.2గా ఉంది. . జనరల్-ఈడబ్ల్యూఎస్ కటాఫ్ గత ఏడాది 75.6, 2022లో 63.1 ఉండగా, ఈ ఏడాది 81.3గా ఉంది.

ఓబీసీ కేటగిరీ అర్హత పర్సంటైల్ 2022లో 68 నుంచి 79.6కు, 2023లో 73.6కు పెరిగింది. 2023లో 37.2, 2022లో 26.7గా ఉన్న ఎస్సీ, ఎస్టీల పర్సంటైల్ 2023లో 51.9, 2022లో 43 నుంచి 46.6కు పెరిగింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ డ్ కు 2,50,284 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2023లో 2,51,673 మంది జేఈఈ (మెయిన్) అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించారు.

స్కోర్‌ కార్డులు విడుదల…

దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ స్కోరు సాధించిన వారిలో 22 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు.

100శాతం సాధించిన తెలంగాణ విద్యార్థులు..

1. హందేకర్‌ విదిత్‌

2. ముత్తవరపు అనూప్‌

3. వెంకట సాయి తేజ మద్దినేని

4. రెడ్డి అనిల్‌

5. రోహన్‌ సాయి బాబా

6. మోహన్‌ కల్లూరి

7. కేసం చన్న బసవ రెడ్డి

8. మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి

9. రిషి శేఖర్‌ శుక్లా

10. తవ్వ దినేశ్‌ రెడ్డి

11. గంగ శ్రేయాస్‌

12. పొలిశెట్టి రితిష్‌ బాలాజీ

13. తమటం జయదేవ్‌ రెడ్డి

14. మావూరు జస్విత్‌

15. దొరిసాల శ్రీనివాస రెడ్డి

100 శాతం సాధించిన ఏపీ విద్యార్థులు..

1. చింటు సతీష్‌ కుమార్‌

2. షేక్‌ సురజ్‌

3. మకినేని జిష్ణు సాయి

4. తోటంశెట్టి నిఖిలేష్‌

5. అన్నరెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి

6. తోట సాయి కార్తీక్‌

7. మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి

27 నుంచి 'అడ్వాన్స్‌డ్‌'కు దరఖాస్తులు

జేఈఈ అడ్వాన్స్డ్‌….

జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన 2.50 లక్షల మంది విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయొచ్చు. JEE Advanced పరీక్షలకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు ఐఐటీ మద్రాస్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది.

మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను ఈ ఏడాది జూన్‌ 9న ప్రకటిస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం